నాగ శౌర్య ఈ ఏడాది "ఛలో" సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పతాకంపై ఆ సినిమాని తీసి విజయం అందుకున్నాడు. అదే బ్యానర్పై ఇంకో సినిమాని రెడీ చేస్తున్నాడు. "నర్తనశాల" పేరుతో తెరకెక్కుతోన్న కొత్త సినిమా ప్రచారం మొదలుపెడుతున్నాడు.
కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం (జులై 20న) వచ్చేస్తోంది. అంటే ప్రమోషన్ మొదలైంది.
సాయి పల్లవి టెక్కు టమారం మామూలుగా లేదు అని హీరో నాగ శౌర్య కుండబద్దలు కొట్టాడు. ఒక ఇంటర్వ్యూలో అతను ఇలా ఓపెన్గా మాట్లాడాడు. ఈ హీరో అలా అనడంతో ఒక్కసారిగా సాయి పల్లవి అటిట్యూడ్ గురించి డిస్కషన్ మొదలైంది టాలీవుడ్ ఇండస్ట్రీలో.
పల్లవి రెగ్యులర్ హీరోయిన్ కాదు. ఈ అమ్మడు వచ్చిన ఆఫర్నల్లా ఒప్పుకోదు. తనకి నచ్చితేనే చేస్తుంది. డబ్బు వస్తుందా కదాని సైన్ చేయదు. అలాగే నాని లాంటి హీరో సినిమాలో నటించినా..ఆమె రిలీజ్ తర్వాత ఎంసీఎ ప్రమోషన్కి రాలేదు. ఎందుకంటే ఆమె సీన్లని కుదించారు. దాంతో అలా అలక వహించి..దిల్రాజుకి కూడా ఝలక్ ఇచ్చింది.