టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ఈరోజు మరిన్ని మలుపులు తిరిగింది. ఇవ్వాల్సిన వాళ్లకు నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ పోలీసులు ఇప్పుడు ఒక్కో విషయాన్ని, ప్రతి ఒక్కరి రెస్పాన్స్ ను జాగ్రత్తగా గమనిస్తున్నారు. నిన్నటివరకు గుంభనంగా ఉన్న ఈ విషయంపై ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు.
పూరి జగన్నాథ్ ఏమన్నాడంటే..
“ఇప్పటివరకు నేను ఎవరిపైనా, దేనిపైనా ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతం పైసావసూల్ సినిమాను కంప్లీట్ చేయడంలో నేను చాలా బిజీగా ఉన్నాను.”
మొన్నటివరకు పోర్చుగల్ లో భారీ షెడ్యూల్స్ చేసి హైదరాబాద్ వచ్చింది "పైసా వసూల్" యూనిట్. షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మిగతా షూటింగ్ కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ బాలయ్య మాత్రం గ్యాప్ ఇవ్వలేదు. అవును.. "పైసా వసూల్" కొత్త షెడ్యూల్ అప్పుడే ప్రారంభమైంది.