రజనీకాంత్ రూటు మార్చాడు. ఒకప్పుడు తన సినిమాలకు తనే బ్రాండ్ అంబాసిడర్. కానీ ఇప్పుడు తన సినిమాల్లో ఇతర హీరోల్ని కూడా కలుపుకుంటున్నాడు. ప్రచారం కోసం వాళ్లను కూడా వాడుకుంటున్నాడు. ఇప్పుడీ పద్ధతిని పీక్ స్టేజ్ కు తీసుకెళ్లబోతున్నాడు రజనీకాంత్. తన అప్ కమింగ్ మూవీ దర్బార్ కోసం ఏకంగా ముగ్గురు సూపర్ స్టార్స్ ను రంగంలోకి దించుతున్నాడు.
తమిళనాట రాజకీయాలకి చెన్నైలోని పోయెస్ గార్డెన్...కేంద్రంలాంటిది. కొన్ని దశాబ్దాలపాటు పోయెస్ గార్డెన్ ..తమిళ రాజకీయాలను శాసించింది. అవును.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్కడే నివాసం ఉండేది. ఆమె మరణంతో పోయెస్గార్డెన్ ఏరియా బోసిపోయింది. మళ్లీ ఆ ప్రాంతం.. తమిళ రాజకీయాలను శాసిస్తుందా అని అడిగితే రజనీకాంత్ ఇచ్చిన సమాధానం - వెయిట్ అండ్ సీ.