రానా గత ఏడాదిన్నర కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తాజాగా ఈ వ్యాధికి శాశ్వత చికిత్స కోసం అమెరికా వెళ్లాడు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలా లేక వేరే విధంగా నయం చేయవచ్చా అనేది ఈ వారంలో అక్కడి నెఫ్రాలిజిస్ట్ డిసైడ్ చేస్తారు. గత వారమే రానాతో పాటు రానా తండ్రి సురేష్బాబు, తల్లి లక్ష్మీ సహా అందరూ అమెరికా వెళ్లారు. చికిత్స కోసమే రానా అక్కడున్నది నిజమే.
"రుద్రమదేవి" దర్శకుడు గుణశేఖర్ తన బర్త్డే సందర్భంగా తన తదుపరి చిత్రం రానా హీరోగా "హిరణ్యకశ్యప" అని ప్రకటించాడు. కానీ ఇందులో కొత్త న్యూస్ ఏముంది. రెండేళ్లుగా అనేకసార్లు ఈ సినిమా గురించి మీడియా రాసింది. గుణశేఖర్ కొత్తగా చెప్పింది ఏమి లేదు.
ఈ సినిమా ఎపుడు మొదలవుతుందో చెప్పలేదు. నిర్మాత ఎవరో వివరించలేదు. బడ్జెట్ ఊసు లేదు. రానా హీరో, దర్శకుడు గుణశేఖర్. పౌరాణిక చిత్రం. ఇంతే చెప్పారు. ఇది వెరీ ఓల్డ్న్యూస్.
చాన్నాళ్ల తర్వాత శ్రీరెడ్డి తన పాత పద్దతుల్లో పోస్ట్లు పెడుతోంది. రీసెంట్గా ఆమె కొత్త ఆరోపణలు ఏవీ చేయలేదు. పాత వాటికే పోపు పెడుతోంది. ఎన్నికల సమయంలో ఆమె మళ్లీ యాక్టివ్ కావడం విశేషం. మొన్న పోస్ట్ చేసిన దాంట్లో కొరటాల శివపై తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఇపుడు నిర్మాత సురేష్బాబుని తిట్టింది.
"పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ధి, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదకు వదుల్తారా? సరసాల్లో చనిపోయిన మీ తాతని మించిపోయారు వారసులు. వీటన్నింటికీ అడ్డా రామానాయుడు స్టుడియోస్, అంటూ పోస్ట్ చేసింది.