శ్రీదేవి జీవితాన్ని దగ్గరిగా చూసిన వారిలో డైరక్టర్ రాంగోపాల్ వర్మ ఒకరు. శ్రీదేవి అంటే ఆయనకి పిచ్చి అభిమానం. ఐతే ఆమె చివరిగా ఇలా తనువు చాలించడం వర్మని బాధించింది. ఆమె జీవితంలోని కొన్ని చీకటి అంశాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టాడు. అతిలోక సుందరిగా పేరొందిన శ్రీదేవి జీవితం అంత అందమైనది కాదు. ఆమె జీవితాంతం రెస్ట్లెస్గానే బతికినట్లు వర్మ రాసిందాన్ని బట్టి అర్థమవుతోంది.
ఇక ఎటువంటి అనుమానాలకి తావులేదు. మూడు రోజుల అనంతరం దుబాయ్ పోలీసులు శ్రీదేవి కేసుని క్లోజ్ చేశారు. ఆత్మహత్యనా, హత్యనా.. అంటూ మీడియా సాగిస్తున్న కథనాలకి పూర్తిగా తెరపడింది.
దుబాయ్ పోలీసులు రిపోర్ట్ అందించారు. ఆమె నీటిలో మునగడం వల్లే చనిపోయిందని ఆ నివేదికలో తేల్చారు. మరి ఆమె బాత్టబ్బులో ఎలా మునిగిందనేదానికి కూడా సమాధానం ఇచ్చారు ఆ రిపోర్ట్లో. అన్కాన్సియస్ కావడం వల్లే మునిగిందని తేల్చారు. ఆమె ఎందుకు స్పృహ కోల్పోయింది అంటే.. బాగా మద్యం సేవించడమే! ఎందుకంటే ఆమె రక్తనమూనాల్లో అధికంగా ఆల్కహాల్ శాతాన్ని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు.