శ్రీదేవి మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఆమె బాత్టబ్బులో పడి మరణించిందనేది అధికారిక మాట. ఐతే ఆమె మరణంపై ఎన్నో అనుమానాలున్నాయి. ఇదే పాయింట్ తో సినిమా తీస్తున్నారా అనిపించేలా ఒక మూవీ వస్తోంది. దాని పేరు శ్రీదేవి బంగ్లా. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న భామ ఎవరో కాదు..ప్రియా ప్రకాష్ వారియర్. ఈ భామ ఇటీవల ఒక మలయాల సినిమాలో కన్నుగీటి ఇండియా అంతా డ్రీమ్గాల్గా మారింది.
వానపాటల్లో "ఆకుచాటు పిందె తడిసే" పాట ఎంతో పాపులర్. "వేటగాడు" సినిమా కోసం ఎన్టీఆర్, శ్రీదేవిలపై దర్శకరత్న కె.రాఘవేంద్రరావు చిత్రీకకరించిన ఈ పాటని ఇపుడు ఎన్టీఆర్ బయోపిక్లో మళ్లీ చూడబోతున్నాం. 1979లో వేటగాడు విడుదలైంది. అంటే దాదాపు 39 ఏళ్ల తర్వాత అదే పాటని మనం కొత్తగా చూడబోతున్నాం.
ఎన్టీఆర్ బయోపిక్లో ఎన్టీఆర్గా ఆయన కుమారుడు బాలయ్య,శ్రీదేవిగా రకుల్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాటని దర్శకుడు క్రిష్ హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. పాట స్టిల్ని తాజాగా విడుదల చేశారు. బాలయ్య, రకుల్పై తీస్తున్న ఈ వాన పాట సినిమాకి హైలెట్ కానుందట.