రామ్చరణ్ భార్య ఉపాసన తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆమె చేవెళ్ల నుంచి పోటీ చేస్తారని వార్తాకథనాల మాట. ఉపాసన పిన్ని భర్త కొండా విశేశ్వర్ రెడ్డి.. ఇటీవలే తెరాసని వీడి కాంగ్రెస్లో చేరారు. తెరాసలో నియంతృత్వ పోకడలున్నాయని ఆరోపిస్తూ ..కాంగ్రెస్ గెలుస్తుందన్న భ్రమలో పార్టీని వీడారు. కానీ తెరాస మళ్లీ బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాస్ గెస్ట్హౌస్ని తెలంగాణ రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్రభాస్ కట్టుకున్న గెస్ట్హౌస్ హైదరాబాద్లోని రాయదుర్గం ఏరియాలో సర్వే నెంబర్ 45లో ఉంది. సర్వే నెంబర్ 45లో 84 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలో 2200 గజాల ప్లాట్ని ప్రభాస్ కొనుక్కొని గెస్ట్హౌస్ కట్టుకున్నాడు. ఐతే ఈ సర్వే నంబర్ మొత్తంగా ప్రభుత్వానికే చెందుతుందని మూడు నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల కారణంగా అధికారులు సైలెంట్గా ఉన్నారు. ఇపుడు స్వాధీనం చేసుకున్నారు.
"సర్..సర్లే ...ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని జరుగుతాయా ఏమిటి" అని వీరభద్ర సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక డైలాగ్ చెపుతాడు. ఆ సినిమాలో బండ్ల గణేష్ కూడా నటించాడు. ఇపుడు బండ్ల గణేష్ రియల్లైఫ్లో బాలయ్య డైలాగ్ వల్లిస్తున్నాడు.
ఎన్నికల టైమ్లో వంద అంటాం.. అన్నీ చేస్తామా? ఏమిటి? అని తాజాగా స్పందించాడు బండ్ల గణేష్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని జర్నలిస్ట్లతో, మీడియాతో బెట్టింగ్లు కట్టాడు బండ్ల. అంతేకాదు, ఒకవేళ తెరాస గెలిస్తే సెవన్ ఓ క్లాక్ బ్లేడ్తో తన గొంతు కోసుకుంటా అని శపథం చేశాడు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య శ్రుతి మించి విమర్శలు చేశాడు. తెలంగాణ కేసీఆర్పై రాజకీయ విమర్శలు కాకుండా మరీ పర్సనల్గా తిట్టాడు. దాంతో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ బాలయ్యని ట్రాల్ చేస్తూ జనాలు షేర్ చేసిన బుల్ బుల్ వీడియాలను తను కూడ రీట్వీట్ చేశాడు.