మహేష్బాబు నటిస్తున్న "మహర్షి" సినిమా షూటింగ్ తుది దశకి చేరుకొంది. ఈ సినిమాకి సంబంధించిన చిన్న ఎపిసోడ్ని ఇటీవల చెన్నై, మహాబలిపురంలలో చిత్రీకరించారు. చెన్నై షూటింగ్ పూర్తి అయిందని మహేష్బాబు భార్య నమత్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్బాబు కూతురు, కొడుకు, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు.. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్తో దిగిన ఫోటోలను ఆమె షేర్ చేశారు.
ఒకప్పటితో పోల్చితే ఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొఫెషనిలిజం వచ్చింది. రిలీజ్ డేట్స్ని చాలా ముందుగానే ఫిక్స్ చేసి..దానికి కట్టుబడి ఉంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో మాత్రం మార్పు ఉండడం లేదు. ఐతే వంశీ పైడిపల్లి వంటి కొందరు దర్శకులు మాత్రం ఇప్పటికీ చెప్పిన డేట్కి సినిమాని పూర్తి చేయలేకపోతున్నారు. ట్రేడ్ వర్గాలు వంశీ పైడిపల్లి, సుకుమార్ వంటి కొందరు దర్శకులకి చెక్కుడు డైరక్టర్స్ అని నామకరణం చేసింది. ఏ సినిమాని చెప్పిన డేట్కి పూర్తి చేయరు. అనేక సార్లు వాయిదాలు కోరుతారు.