మహేష్బాబు, రామ్చరణ్, ఎన్టీఆర్ల మధ్య స్నేహబంధం మరింత బలపడింది. గత ఏడాది, ఏడాదిన్నర కాలంగా ఈ త్రిమూర్తులు రెగ్యులర్గా కలుసుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు. రామ్చరణ్, ఎన్టీఆర్ మధ్య అంతకుముందు నుంచే ఫ్రెండ్సిప్ ఉంది. అంతేకాకుండా, చరణ్, ఎన్టీఆర్ త్వరలో కలిసి రాజమౌళి సినిమాలో నటించనున్నారు. దాంతో ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య స్నేహం పెరిగింది. పిల్లల బర్త్డేల పార్టీలకి వెళ్లడం, వారికి సోషల్ మీడియాలో వీడియో సందేశాలు ఇవ్వడం కూడా చేస్తున్నారు.