విజయశాంతి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయనర్గా ప్రచార రంగంలోకి దిగారు. తెలంగాణలో ఆమె ప్రచారం చేస్తున్నారు కానీ ఆమెకి ప్రచారం దక్కడం లేదు. జనరల్గా స్టార్ క్యాంపెయనర్ల ప్రచారానికి మీడియా ఎక్కువ కవరేజ్ ఇస్తూ ఉంటుంది. కానీ రాములమ్మ ప్రచారానికి మీడియాలో పెద్దగా చోటు దక్కడం లేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ఇంతకుముందు చెప్పింది రాములమ్మ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన విజయశాంతి ఈ సారి ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతానని ప్రకటించింది. ఎంపీ ఎన్నికలపై కన్నేసిన ఆమె ఈసారి అసెంబ్లీ ఎన్నికలకి దూరం ఉండాలనుకొంది. ఐతే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆమెని రంగంలోకి దింపాలనుకుంటోంది.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమెని పోటీ చేయమని కోరుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే ఆమె పేరుని ఈ సీట్కి ఖరారు చేశారని, త్వరలోనే తొలి జాబితా ప్రకటనలో ఆమె పేరు ఉంటుందని మీడియా రిపోర్ట్స్ చెపుతున్నాయి.