మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఇన్నింగ్స్ ముగిసిందని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో కొన్నాళ్లూగా యాక్టివ్గా లేరు. కాంగ్రెస్ పార్టీ కలాపాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఖైదీ నెంబర్ 150తో సక్సెస్ఫుల్గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇపుడు హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు. అంతేకాదు, ఆయన రాజ్యసభ పదవీకాలం కూడా ముగిసింది. ఇపుడు ఆయన మాజీ ఎంపీ మాత్రమే.
సినిమాలకి సంబంధించిన విషయాలే కాదు తెలుగునాట కీలకమైన ప్రతి రాజకీయ పరిణామంపై తనదైన శైలిలో పోస్ట్లు పెట్టడం రాంగోపాల్ వర్మ శైలి. తాజాగా ఆయన తెలంగాణ మాజీ టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డిని బాహుబలి అని డిక్లేర్ చేశాడు. తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నికల నాటికి బాహుబలి వస్తాడని ఆ మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఆ బాహుబలి రేవంత్ రెడ్డి అని వర్మ ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది.