"దంగల్", "సీక్రెట్ సూపర్స్టార్" సినిమాలతో పాపులర్ అయిన జైరా వసీమ్ ఇపుడు సినిమా రంగానికి దూరంగా ఉంటానని ప్రకటించింది. దానికి ఆమె చెప్పిన కారణమే ఇపుడు దుమారం రేపుతోంది. తన ఇస్లాం మత విశ్వాసాలకి విరుద్దమైన పంథాలో సాగే ఈ సినిమా ఇండస్ర్టీతో ప్రయాణం సాగించడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకుందట.
'బాహుబలి 2' సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్త వసూళ్లలో 'దంగల్' సినిమా నంబర్ వన్ ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ రెండు సినిమాలు పోటీపడి మరీ వసూళ్ల వర్షం కురిపించాయి. మిగతా హీరోలకు సరికొత్త టార్గెట్స్ ఫిక్స్ చేశాయి. అయితే ఈ రెండు సినిమాలు సాధించిన రికార్డుల్ని క్రాస్ చేయాలంటే అది కొంతమంది హీరోలకు మాత్రమే సాధ్యం. అందుకే ప్రస్తుతం అందరి చూపు సల్మాన్ ఖాన్, రజనీకాంత్ పైనే పడింది.
ప్రస్తుతం 'దంగల్' సినిమా చైనాలో బీభత్సంగా ఆడుతోంది. త్వరలోనే 'బాహుబలి 2' సినిమా కూడా చైనాలో విడుదలకాబోతోంది. అయితే చైనా వసూళ్లు చెప్పుకోడానికి తప్ప దేనికీ పనికిరావంటున్నాడు రాజమౌళి. కేవలం గ్రాస్ పెంచుకోడానికే తప్ప, జేబు నిండదని అంటున్నాడు. చైనా లెక్కల్లో లూప్ హోల్స్ ను బయపెట్టాడు.