తమిళ హీరో శింబుది..మన టాలీవుడ్ మంచు మనోజ్ది సేమ్ సీన్. ఇద్దరికీ హిట్ వచ్చి చాలా కాలమే అయింది. ఇద్దరికీ డైరక్షన్లో వేలు పెట్టడం కామన్ అలవాటు. మనోజ్కి లేని ఒక అలవాటు శింబుకి ఉంది. బాలీవుడ్లో ఏ హీరోయిన్ అయినా బాగా క్రేజ్ తెచ్చుకుంటే చాలు ఆమెని సౌత్కి తీసుకొచ్చి తన సినిమాలో నటింపచేయాలనకుంటాడు. మందిరా బేడీ పీక్లో ఉన్నపుడు మన్మధలో నటింపచేశాడు. అది ఒక చిన్న ఉదహరణ.
శింబు ఇప్పుడు జాన్వీ కపూర్ ని టార్గెట్ చేశాడట. శ్రీదేవి కూతురు తొలి సినిమాతోనే సూపర్ పాపులర్ అయింది. ఆమెని తన సరసన నటింపచేయాలనది శింబు థాట్.
శ్రీదేవి కూతురు జాహ్నవి హీరోయిన్గా రంగప్రవేశం చేస్తోంది. ఆమె తొలి చిత్రం..ధడక్. కరణ్జోహర్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ. బాలీవుడ్ మీడియా కెమెరాలు ఇప్పట్నుంచే ఆమె మీద ఫోకస్ నిలిపాయి. ఆమె ఎక్కడికి వెళ్లినా వెంటపడుతున్నాయి. ప్రశాంతంగా జిమ్కి కూడా వెళ్లనివ్వడం లేదు.