హృతిక్ రోషన్, కంగన రనౌత్ మధ్య నడిచిన వివాదం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఈ వివాదం గురించి ఎవర్ని అడిగినా చెబుతారు. అయితే దీనిపై స్పందించడానికి హృతిక్ పెద్దగా ఆసక్తి చూపడు. కంగన మాత్రం తనకు వీలుచిక్కినప్పుడల్లా ఈ వివాదాన్ని రేపుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి హృతిక్ పై కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.
రాంగోపాల్ వర్మ ఎపుడు ఎవరిని పొగుడుతాడో అర్థం కాదు. ఐతే ఆయన ఎవరిని పొగిడినా..దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఆయన వ్యూహాలు లేట్గా అర్థం అవుతాయి. రీసెంట్గా ఆయన తరుచుగా కంగన రనౌత్ని తెగ ప్రశంసిస్తున్నాడు. మణికర్ణిక టీజర్ వచ్చినపుడు ఈ టీజర్ 2.000 టైమ్స్ అదిరిందని పొగిడాడు.
"మణికర్ణిక" సినిమాని 90 శాతం దర్శకుడు క్రిష్ తీశాడు. ఐతే మొత్తం రష్ చూసుకున్న కంగనాకి ... కొన్ని సీన్లు నచ్చలేదు. దాంతో ఆమె రీషూట్ చేసింది. 45 రోజుల పాటు చిత్రీకరించింది. ఒక దశలో డైరక్టర్గా క్రిష్ పేరు తొలగించి, తన పేరే వేసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఐతే ఆ మధ్య విడుదలైన ట్రయిలర్లో మాత్రం జాగర్లమూడి రాధాకృష్ణ అనే పేరుని ఉంచారు. దాంతో క్రిష్ ఊపిరి పీల్చుకున్నాడు.
కంగన రనౌత్ మొండిఘటం. రియల్ లైఫ్లో ఆమెకి అలాంటి ఇమేజ్ ఉంది. ఎంతటి వారినైనా ఎదుర్కొంటుంది. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గదని హృతిక్ రోషన్తో ఆమె గొడవపడ్డ తీరు చెపుతోంది. అంతేకాదు క్వీన్, తను వెడ్స్ మను వంటి సినిమాల టైమ్లోనూ దర్శకులతో గొడవపడి ఫైనల్గా తనకి నచ్చినట్లు ఎడిట్ చేయించుకొంది. అది ఆమె తీరు. ఇక ఇపుడు మణికర్ణిక విషయంలోనూ అదే పంథాలో వెళ్తోంది. దర్శకుడు క్రిష్ .."మణికర్ణిక" చిత్రాన్ని 95 శాతం పూర్తి చేసి ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్కి వచ్చాడు.