నిఖిల్ సిద్దార్థ్, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ముద్ర. ఈ చిత్రాన్ని టిఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ముద్ర షూటింగ్ చివరిదశలో ఉంది. ఐదు రోజుల టాకీ.. ఓ పాట ఈ నెలలో పూర్తి చేయనున్నారు.
రీసెంట్గా రెండు ఫ్లాప్లు చూసి డీలాపడ్డ నిఖిల్ ఇపుడు జర్నలిస్ట్గా మారాడు. ఒక తమిళ సినిమా ఆధారంగా రూపొందుతోన్న "ముద్ర" సినిమాలో నటిస్తున్నాడు. ఇంతకుముందు ఒక కన్నడ సినిమా రీమేక్తో అపజయం పొందాడు. కానీ ఈ సారి కథ బాగుందంటున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. దీపావళి సందర్భంగా నవంబర్ 8న రిలీజ్ అవుతుందట.
ఈ సినిమాలో లావణ్య తిపాఠీ నటిస్తోంది. నిఖిల్తో లావణ్య నటించడం ఇదే ఫస్ట్టైమ్.