ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి బాలకృష్ణ తీయనున్న బయోపిక్కి టైటిల్ ఫిక్స్ అయింది. ఎన్టీఆర్ అనే పేరునే టైటిల్గా రిజిష్టర్ చేయించారు. ఒకే ఒక్కడు, భారతరత్న, తిరుగులేని మనిషి వంటి పేర్లను పరిశీలించారు కానీ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల్లోనే అసలు పవర్ ఉందని అదే టైటిల్ని రిజిష్టర్ చేశారు. నిర్మాత సాయి కొర్రపాటి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడు.
తేజ దర్శకత్వంలో రూపొందే ఈ బయోపిక్ని నందమూరి బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రెపాటి సంయుక్తంగా నిర్మిస్తారు. వారి మూడు బ్యానర్స్ పాలుపంచుకొంటాయి నిర్మాణంలో.
వాణీ విశ్వనాథ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనేది పాత న్యూసే. మలబార్ తీరాన పుట్టిన ఈ కేరళ కుట్టి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హల్చల్ చేయనుంది. త్వరలోనే అధికారికంగా టీడీపీలో చేరుతుంది. అయిత పార్టీలో చేరకముందే...ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడేస్తోంది. రాంగోపాల్ వర్మపై విమర్శలు గుప్పించింది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ చరిత్రని తీస్తున్నా అని వర్మ ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు తెగ వర్రీ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇపుడు వాణీ విశ్వనాథ్ స్పందించింది.