"తెలంగాణా.. పాకిస్థానా "అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కూడా ఘాటుగా రియాక్టయ్యారు. ఓట్ల కోసం పవన్ కల్యాణ్ దిగజారి మాట్లాడడం సబబు కాదని హితవు చెప్పారు. తెలంగాణలో ఆంధ్రావారికి ఎవరికీ భయం లేదు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రశాంత వాతావరణం చెడగొట్టొద్దు అని అన్నారు.
నంది అవార్డుల వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. ప్రముఖ నటుడు, రచయిత తనకి వచ్చిన నందిని వాపసు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. టెంపర్ సినిమాలో నటనకిగాను ఆయనకి ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. అయితే తాను కమ్మవాడిని కాబట్టే ఈ అవార్డు ఇచ్చారని అందరూ అంటున్నారని, ఇది నాకు సిగ్గుచేటు అని మండిపడ్డారు పోసాని. ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల నంది అవార్డుల ప్రతిష్ట మసకబారిందని అన్నారు పోసాని.