Prabhas Guest House

ప్ర‌భాస్‌కి ఊర‌ట ద‌క్కేనా?

సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ప్ర‌భాస్ గెస్ట్‌హౌస్‌ని తెలంగాణ రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్ర‌భాస్ క‌ట్టుకున్న గెస్ట్‌హౌస్ హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గం ఏరియాలో స‌ర్వే నెంబ‌ర్ 45లో ఉంది. స‌ర్వే నెంబ‌ర్ 45లో 84 ఎక‌రాల స్థ‌లం ఉంది. ఈ స్థ‌లంలో 2200 గ‌జాల ప్లాట్‌ని ప్ర‌భాస్ కొనుక్కొని గెస్ట్‌హౌస్ క‌ట్టుకున్నాడు. ఐతే ఈ స‌ర్వే నంబ‌ర్ మొత్తంగా ప్ర‌భుత్వానికే చెందుతుంద‌ని మూడు నెల‌ల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నిక‌ల కార‌ణంగా అధికారులు సైలెంట్‌గా ఉన్నారు. ఇపుడు స్వాధీనం చేసుకున్నారు.

ప్ర‌భాస్ గెస్ట్‌హౌస్ సీజ్ చేసిన అధికారులు

ప్ర‌భాస్‌కి షాక్ తగిలింది. ప్ర‌భాస్ కొనుక్కొన్న ప్రీమియం ల్యాండ్ ప్ర‌భుత్వానికి వెళ్తోంది. తెలిసో, తెలియ‌క ప్ర‌భాస్ హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గంలో కొంత‌స్థ‌లం కొన్నాడు.ఆ స్థ‌లాన్ని త‌న గెస్ట్‌హౌస్ కోసం వాడుతున్నాడు. అయితే, ఇటీవ‌ల కోర్టు ఆ స‌ర్వే నెంబ‌ర్‌లోని మొత్తం స్థ‌లం ప్ర‌భుత్వానిదే అని తీర్పు ఇచ్చింది. రాయ‌దుర్గంలోని మొత్తం 85 ఎక‌రాలు పూర్తిగా ప్ర‌భుత్వానికే చెందుతుంద‌ని  సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Subscribe to RSS - Prabhas Guest House
|

Error

The website encountered an unexpected error. Please try again later.