నిన్న రిలీజైన ఏడు చేపల కథ సినిమాకు సంబంధించి ఆలస్యంగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరెడ్డి క్యారెక్టర్ ఉంది. పూర్తిగా ఆమెను ప్రతిబింబించేలా పాత్రను చూపించలేదు కానీ, శ్రీరెడ్డి ఏ ఘటనతో పాపులర్ అయిందో, ఆ సన్నివేశాన్ని యాజ్ ఇటీజ్ గా ఏడు చేపల కథ సినిమాలో వాడారు.
శ్రీరెడ్డి రాతలు, శ్రీరెడ్డి కోతలు....రెండూ అతినే. శ్రీరెడ్డి మాటలు, శ్రీరెడ్డి చేష్టలు....రెండూ భరించలేం. కానీ ఆమెకి తెలుసు ఎలా వార్తల్లో నిలవాలో. ఏం టార్గెట్ చేస్తే కలకలం రేగుతుందో అదే చేస్తుంది. గత ఐదారు నెలలుగా తెలుగు రాష్ట్రాలకి దూరంగా చెన్నైలో ఉంటూ అక్కడి సాంబారు తింటూ సాత్వికంగా మారిపోయిందనిపించింది. ఐతే తినే నోరు, తిరిగే కాలు ఊరుకోదు అన్నట్లు మళ్లీ ఆమె ఇపుడు హైదరాబాద్కి షిప్ట్ అయింది. మళ్లీ ఎఫ్బీలో ఎఫ్ వర్డ్ సమేతంగా బూతుల పర్వం అందుకుంటోంది. పాత ఆరోపణలను కొత్తగా చేస్తోంది.
చాన్నాళ్ల తర్వాత శ్రీరెడ్డి తన పాత పద్దతుల్లో పోస్ట్లు పెడుతోంది. రీసెంట్గా ఆమె కొత్త ఆరోపణలు ఏవీ చేయలేదు. పాత వాటికే పోపు పెడుతోంది. ఎన్నికల సమయంలో ఆమె మళ్లీ యాక్టివ్ కావడం విశేషం. మొన్న పోస్ట్ చేసిన దాంట్లో కొరటాల శివపై తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఇపుడు నిర్మాత సురేష్బాబుని తిట్టింది.
"పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ధి, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదకు వదుల్తారా? సరసాల్లో చనిపోయిన మీ తాతని మించిపోయారు వారసులు. వీటన్నింటికీ అడ్డా రామానాయుడు స్టుడియోస్, అంటూ పోస్ట్ చేసింది.