వాళ్ల లొల్లి పోయింది అనుకున్నాం. కానీ శ్రీరెడ్డి, కత్తి మహేష్ మళ్లీ చేతులు కలిపినట్లున్నారు. ఇద్దరూ మళ్లీ పవర్స్టార్ని టార్గెట్ చేయనున్నారా అనిపిస్తోంది.
రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ నగర బహిష్కరణకి గురైన కత్తి మహేష్..తాజాగా శ్రీరెడ్డిని కలిశాడు. ఎక్కడ కలిశాడో తెలియదు కానీ ఆ ఫోటోలను శ్రీరెడ్డి షేర్ చేసింది. ఎవరి ఫేస్ చేస్తే పీకే ఫ్యాన్స్ రక్తం ఉడుకుతుందో వాడే కత్తిగాడు అంటూ ఒక క్యాప్సన్ని కూడా వదిలింది.
అందరూ భావిస్తున్నట్లు తాను ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకోలేదంటోంది శ్రీరెడ్డి.
వివాదాలకి మారుపేరుగా మారిన శ్రీరెడ్డి....అవకాశాల కోసం తనని ఎందరో వాడుకున్నారని బయటపెట్టి సంచలనం సృష్టించింది. మొదట ఆమె చేసిన ఆరోపణల్లో, ఆమె ఆవేదనలో కొంత నిజముందనిపించింది. ఐతే ఆ తర్వాత ఆమె చేస్తున్న ఆరోపణలు జుగుప్స కలిగించడం మొదలు పెట్టాయి. ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్న భావన అందరిలో మొదలైంది.