ప్రభాస్కి షాక్ తగిలింది. ప్రభాస్ కొనుక్కొన్న ప్రీమియం ల్యాండ్ ప్రభుత్వానికి వెళ్తోంది. తెలిసో, తెలియక ప్రభాస్ హైదరాబాద్లోని రాయదుర్గంలో కొంతస్థలం కొన్నాడు.ఆ స్థలాన్ని తన గెస్ట్హౌస్ కోసం వాడుతున్నాడు. అయితే, ఇటీవల కోర్టు ఆ సర్వే నెంబర్లోని మొత్తం స్థలం ప్రభుత్వానిదే అని తీర్పు ఇచ్చింది. రాయదుర్గంలోని మొత్తం 85 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ప్రియా వారియర్ గుర్తుందా? కొన్ని నెలల క్రితం ఈ కేరళ కుట్టి పేరు దేశమంతా మార్మోగింది. ఒక మలయాళ సినిమాకి సంబంధించిన పాటలో హీరోకి కన్నుగీటిన ఒక సీన్.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓవర్నైట్ ఆమె గురించి దేశమంతా మాట్లాడుకొంది. నాలుగు నెలల తర్వాత అందరూ ఆమె గురించి మర్చిపోయారు. ఆ సినిమా ఏమైందో కూడా ఎవరికీ తెలియదు.