ఈ శుక్రవారం రిలీజైన "బ్రాండ్బాబు"పై కేసు నమోదైంది. ఒక మహిళా జర్నలిస్ట్ సినిమాపై కేసు వేసింది. తన అనుమతి లేకుండా తన ఫోటోని సినిమాలో ఉపయోగించారని ఓ మహిళా జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో చావుకి సంబంధించిన సన్నివేశంలో తన ఫోటోని చూపించారని, దీనికి తన పర్మిషన్ తీసుకోలేదని ఆమె ఫిర్యాదు చేశారు.
ఇది తనకి, తన కుటుంబ సభ్యులకి తీవ్ర మనస్థాపం కలిగించిందని ఆమె చెప్పడంతోమూవీ మేకర్స్పై ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అనసూయపై కేసు నమోదయింది. ఎందుకు? సెల్ఫీ అడిగిన ఒక అబ్బాయి ఫోన్ని విసిరికొట్టినందుకు! ఐతే ఆ అబ్బాయి తల్లి అబద్దం చెపుతోందంటోంది అనసూయ. అసలు మేటర్ ఏంటి...
తార్నాక వచ్చిన అనసూయతో సెల్ఫీ దిగాలనుకున్నాడు ఓ పదేళ్ల బాలుడు. టీవీల్లో, సినిమాల్లో కనిపించే సెలబ్రిటీ తమ ఏరియాకి రావడంతో ఆ పిల్లాడు ఎక్సయిట్ ఆమెతో ఫోటో దిగాలనుకున్నాడు. ఐతే తన మూడు బాలేదు అన్న ఉద్దేశంతో ఆమె నిరాకరించింది. ఐనా ఆమె తల్లి వీడియో తీసే ప్రయత్నం చేయడంతో అనసూయ ఫోన్ని నేలకి విసిరికొట్టింది.