హెబ్బా పటేల్ ...ఎప్పుడు బోల్డ్ హీరోయిన్నే. 'కుమారి 21 ఎఫ్' సినిమా నుంచే అందాలు ఆరబోయడంలో, ముద్దుల సీన్లలో నటించడంలో ఏ మాత్రం సంకోచం లేదని ప్రూవ్ చేసుకోంది. ఆ మధ్య విడుదలైన '24 కిస్సేన్ సినిమాలో పెట్టిన ముద్దుల సంఖ్య తక్కువేమి కాదు. ఇంత చేసినా ఇటీవల ఆమెకి సరైన ఆఫర్లు దక్కలేదు. దాంతో మొత్తంగా మేకోవర్ కి వెళ్ళింది.
ఇప్పుడు కసుక్కుమనిపించే ఫోటో షూట్ అందాలతో కిరాకు పుట్టిస్తోంది.
హెబ్బా పటేల్ ఇక సినిమాలు తగ్గిస్తుందట. అంటే ఇపుడు బాగా బిజీగా ఉందని కాదు కానీ మళ్లీ నటిగా జోరు పెంచేముందు కొంత బ్రేక్ తీసుకుంటుందట. ఆమె నటించిన కొత్త చిత్రం "ఏంజెల్" నవంబర్ 3న విడుదలవుతున్న నేపథ్యంలో హెబ్బా పటేల్ విలేకరులతో ముచ్చటించింది.
"కుమారి 21ఎఫ్ సినిమా తరువాత మరోసారి టైటిల రోల్ లో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉన్నాను, ఈ చిత్రంలో నా పాత్ర ఏంజిల్. అందరూ అలానే పిలుస్తుంటారు. దివి నుంచి దిగివచ్చిన నాకు హీరో కు పరిచయం ఎలా అవుతుంది? దివి నుంచి దిగికు ఎలా వచ్చాను అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్," అంటోంది ఈ భామ.