కమెడియన్ అలీ 40 ఏళ్ల సినిమా కెరియర్ని పూర్తి చేసుకున్నాడు. ఇక ఇపుడు అతని దృష్టి రాజకీయాలపై పడింది. ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని మొదట వైఎస్సార్సీ పార్టీని సంప్రతించాడు. అంతకుముందు జనసేనలో ఉన్నాడు. చివరికి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యాడు. అందుకే తన 40 ఏళ్ల కెరియర్ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబుని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు.
కమెడియన్ అలీ ఈ సారి ఏపీ ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నాడు. తన సొంత పట్టణమైన రాజమండ్రి నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ బరిలోకి దిగాలనేది ఆయన డ్రీమ్. గుంటూరు సీటుని ముస్లింలు అధికంగా ఉన్నారనే కారణంతో అడుగుతున్నాడు. మొన్న వైఎస్సార్సీ అధినేత జగన్ని కలిసి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. ఇపుడు తెలుగుదేశం పార్టీ మంత్రి గంటాని కలిసి మళ్లీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఏ పార్టీలో చేరనున్నాడు? ఏ విషయమైనా సంక్రాంతి తర్వాత అంటే జనవరి 16న ప్రకటిస్తానని అంటున్నాడు అలీ.
రాంగోపాల్ వర్మ ట్వీట్లు, ఆయన మాటలు చూసి జనాలు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆయనకి ఆడవాళ్ల పిచ్చి అని ఒక ఇమేజ్ పడిపోయింది. కానీ ఇన్నేళ్ల కెరియర్లో ఏ హీరోయిన్ కూడా వర్మ గురించి చెడుగా మాట్లాడలేదు. ఆర్జీవీ అడ్డగోలుగా మాట్లాడినట్లు అనిపించినా..వ్యక్తిగా హి ఈజ్ జెంటిల్మెన్. ఆ విషయాన్ని హీరోయిన్ కలర్స్ స్వాతి కూడా ధృవీకరించింది.
హాస్య నటుడు ఆలీ నిర్వహిస్తోన్న టీవీ షోలో కలర్స్ స్వాతి బోలేడన్నీ విషయాలు చెప్పుకొచ్చింది. అందులో వర్మ గురించి చేసిన కామెంట్ ఆసక్తికరం. ఆయన వ్యక్తిత్వాన్ని తెలిపే విధంగా ఉంది ఆమె మాట.
ఎమ్మెల్యే కావాలనేది కమెడియన్ అలీ డ్రీం. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుగా ఉన్నాడు. ఇపుడు పవర్స్టార్తోనే రాజకీయ ప్రయాణం చేయనున్నాడు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అలీ, పవర్స్టార్ ఫ్రెండ్సిప్ ఈనాటిది కాదు. పవన్ కల్యాణ్ కెరియర్ ప్రారంభం నుంచి అలీ ఆయనతో స్నేహంగా ఉంటున్నాడు. అలీ లేకుండా సినిమా ఎలా చేస్తాను అని ఆ మధ్య ఒక ఈవెంట్లో సరదాగా చెప్పాడు పవన్ కల్యాణ్. అంతటి స్నేహబంధం వారిది. అందుకే జనసేన పార్టీ తరఫున రాజమండ్రి అసెంబ్లీ సీటుని జనసేన అధినేత అలీకి ఇస్తానని ప్రామిస్ చేశాడట.