ఇప్పటికే కాస్త బొద్దుగా ఉంటుంది. ఆ విషయం సౌత్ లో అందరికీ తెలుసు. అలాంటి బొద్దుగుమ్మ ఇంకాస్త ఒళ్లు చేస్తే కష్టమే మరి. కానీ తప్పదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తోందక్కడ. కాస్త లావెక్కక తప్పదిక్కడ. ప్రస్తుతం కీర్తి సురేష్ అదే పనిలో ఉందట.
సావిత్రి పాత్ర కోసం మరింత బొద్దుగా తయారయ్యేందుకు రెడీ అవుతోంది. ఇలా లావెక్కిన ప్రతిసారి నటీనటులు కొన్ని ఇబ్బందులు పడ్డారు. బాహుబలి సినిమా కోసం బరువెక్కిన ప్రభాస్ తగ్గడానికి చాలా కష్టపడ్డాడు. ఇక అనుష్క అయితే సైజ్ తగ్గించుకోవడానికి ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. ఇలాంటి అనుభవాలు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాయి. కీర్తిసురేష్ కు కూడా ఇప్పుడు అదే టెన్షన్ పట్టుకుందట.
‘మహానటి’ పేరుతో సావిత్రి జీవితగాథని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తోంది. సమంత కీలక పాత్రల్లో నటిస్తోంది. వీరిద్దరితో పాటు ఇందులో అనుష్క కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలనాటి నటి జమున పాత్రలో ఆమె నటించనుందట.
జమున పాత్రకు అనుష్క సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం భావిస్తోంది. జూన్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది. అశ్వనీదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.