ఎన్టీఆర్ బయోపిక్ గ్రాండ్గా రూపొందుతోందనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. ఇప్పటి వరకు వచ్చిన ఫోటోలు అన్నీ సినిమాపై అంచనాలు పెంచుతున్నవే. ఐతే ప్రతి 15 రోజులకో సారి, 20 రోజులకో సారి ఇలా ఒక్కో అకేషన్ని పట్టుకొని ఫోటోలు విడుదల చేస్తుండడం విమర్శలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ చేస్తున్నట్లు లేదు..ఫోటోసూట్లు చేసి విడుదల చేస్తున్నట్లు ఉందని హార్ష్ కామెంట్లు కూడా పడుతున్నాయి.
కంగన రనౌత్ మొండిఘటం. రియల్ లైఫ్లో ఆమెకి అలాంటి ఇమేజ్ ఉంది. ఎంతటి వారినైనా ఎదుర్కొంటుంది. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గదని హృతిక్ రోషన్తో ఆమె గొడవపడ్డ తీరు చెపుతోంది. అంతేకాదు క్వీన్, తను వెడ్స్ మను వంటి సినిమాల టైమ్లోనూ దర్శకులతో గొడవపడి ఫైనల్గా తనకి నచ్చినట్లు ఎడిట్ చేయించుకొంది. అది ఆమె తీరు. ఇక ఇపుడు మణికర్ణిక విషయంలోనూ అదే పంథాలో వెళ్తోంది. దర్శకుడు క్రిష్ .."మణికర్ణిక" చిత్రాన్ని 95 శాతం పూర్తి చేసి ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్కి వచ్చాడు.
అనుకున్నట్లే జరిగింది. "మణికర్ణిక" సినిమాకి డైరక్టర్గా తన పేరు వేసుకొంది కంగన రనౌత్. "మణికర్ణిక" సినిమా మొత్తాన్ని క్రిష్ డైరక్ట్ చేయగా ఇపుడు రీషూట్ మొదలుపెట్టింది కంగన. అంతేకాదు డైరక్టర్గా తన పేరును చెప్పుకుంటోంది. క్లాప్బోర్డ్ మీద డైరక్టర్: కంగన రనౌత్ అనే పేరు ఉన్న ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
"మణికర్ణిక" సినిమాకి సంబంధించిన షూటింగ్, ప్రొడక్షన్ పనులను దర్శకుడు క్రిష్తో సంబంధం లేకుండా కంగనా రనౌత్ చూసుకుంటోందనేది నిజం. తెలుగు సినిమా.కామ్ ఈ న్యూస్ని ఇంతకుముందే ప్రచురించింది. "మణికర్ణిక" షూటింగ్ని క్రిష్ మ్యాగ్జిమమ్ పూర్తి చేసినా.. కంగనాకి కొన్ని సీన్లు నచ్చలేదు. వాటిని రీషూట్ చేయాలని కోరింది. కానీ అప్పటికే క్రిష్ ..ఎన్టీఆర్ బయోపిక్ ఒప్పుకున్నాడు. దాంతో చేయలేనని అన్నాడు. విచిత్రం ఏమిటంటే.. ఏ దర్శకుడు అయినా ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయి, సెన్సార్ పూర్తయ్యేవరకు ఆ సినిమాతోనే ఉంటాడు, మరో సినిమా షూటింగ్ ఒప్పుకున్నాను అని వెళ్లకూడదు.
రానా ఒక చిన్న సినిమాకి ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్నాడు. "కేరాఫ్ కంచరపాలెం" అనే పేరుతో రూపొందిన ఈ మూవీని హిట్ చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇటీవల తమ బ్యానర్ నుంచి వచ్చిన ఈ నగరానికి ఏమైంది ఆడలేదు. విమర్శకుల ప్రశంసలు అందుకోలేదు. దాంతో ఈ చిన్న సినిమా ప్రమోషన్ బాధ్యతలను తన భుజానా వేసుకున్నాడు.