తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త చరిత్రని సృష్టించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెరాస క్లీన్ స్వీప్ చేసింది. 88 స్థానాల్లో విజయం సాధించింది. గులాబీ బాస్ కేసీఆర్కి ప్రధాని మోదీ సహా అగ్రనేతలంతా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. జనసేనాని పవన్ కల్యాణ్ హైదరాబాద్లో లేకపోవడంతో ప్రత్యేకంగా ప్రెస్నోట్తో తన అభినందనలను అందించారు.
తెలంగాణ ఎన్నికల్లో తెరాసకి అనుకూలంగా ఓటేయ్యాల్సిందిగా తన అభిమానులను, జనసేన కార్యకర్తలను పవన్ కల్యాణ్ కోరుతాడని రాజకీయ విశ్లేషకులు అంతా భావించారు. కానీ జనసేనాని మాత్రం ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడలేదు. వ్యతిరేకంగానూ చెప్పలేదు. ట్విట్టర్ ద్వారా వీడియో సందేశాన్ని పంపాడు.
తక్కువ అవినీతి, పారదర్శకమైన పాలన అందించే వారిని ఎన్నుకోమని కోరాడు. దాన్ని ఆయన అభిమానులు, కార్యకర్తలు ఎలా అర్థం చేసుకుంటారనేది చూడాలి.