పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తొలిసారి ఫుల్ లెంగ్త్ ఇంటర్వ్యూ ఇచ్చింది. నటుడు ఆలీ చేస్తున్న టీవీ షోలో ఆమె మనసు విప్పి మాట్లాడింది. అనేక విషయాలు వెల్లడించింది.
ఆమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోనుంది. కాబోయే భర్త పేరు మాత్రం బయటికి చెప్పనంటూనే అతను పూణెలో ఒక ఐటీ కంపెనీలో డైరక్టర్గా పని చేస్తున్నారని తెలిపింది. ఆయన పేరు చెప్పి ఇబ్బందుల్లో పడెయ్యను అంటోంది. ఇక ఈ రోజు తను బతికి ఉన్నాను అంటే కారణం.. తన కూతురే అని సంచలనంగా ప్రకటించింది. రేణుకి పవన్ కల్యాణ్ ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు అకీరా నందర్. కూతురు ఆద్య.
రచయిత, నిర్మాత కోన వెంకట్ ఒకప్పుడు పవన్ కల్యాణ్ నిత్యం పొగుడుతూ ఉండేవారు. నిత్యం ట్విట్టర్లో అదే రాస్తుండేవారు. పవన్ కల్యాణ్ నా సోల్మేట్ అని అంటుండేవారు. దాంతో పవన్ కల్యాణ్ అభిమానులు కూడా కోనని కూడా బాగా అభిమానిస్తూ వచ్చారు. ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు. ఐతే పవన్ కల్యాణ్ పై ఇటీవల కోన వెంకట్ సునిశిత విమర్శలు చేశారు. కోన వెంకట్ బాబాయ్ కోన రఘుపతి, కోన వెంకట్ బావ ద్రోణంరాజు శ్రీనివాస్, కోన వెంకట్ ప్రొడ్యుసర్ మిత్రుడు ఎంవీవీ సత్యనారయణ.....ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్పీ తరఫున పోటీలో ఉన్నారు.
"తెలంగాణా.. పాకిస్థానా "అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కూడా ఘాటుగా రియాక్టయ్యారు. ఓట్ల కోసం పవన్ కల్యాణ్ దిగజారి మాట్లాడడం సబబు కాదని హితవు చెప్పారు. తెలంగాణలో ఆంధ్రావారికి ఎవరికీ భయం లేదు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రశాంత వాతావరణం చెడగొట్టొద్దు అని అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా భీమవరంలో ఆవేశపూరితంగా చేసిన స్పీచ్ విమర్శలకి గురైంది. తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారన్నట్లుగా మాట్లాడడం కలకలం రేపింది. ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం వేరు కానీ అది కన్వే అయింది మాత్రం తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారనేది.
"మనం (ఆంధ్రా ప్రాంతం ప్రజలు) ఇక్కడ ఈ కులం, ఆ కులం అని చెప్పుకొని మనల్ని మనం విడదీసుకుంటున్నాం. మనం కులాల వారిగా విడిపోతున్నాం. కానీ తెలంగాణ వాళ్లకి మనం దళితులైనా, వైశ్యులైనా, మరో కులం వారైనా..వారందరికీ మనం ఆంధ్రావారిమే. మనల్ని అక్కడ కొడుతున్నారు." ఇలా స్పీచ్ ఇచ్చాడు.