రకుల్ ప్రీతి సింగ్ ఇన్ స్టాగ్రామ్లో చాలా యాక్టివ్. తన ఫోటోలను రెగ్యులర్గా షేర్ చేస్తుంటుంది. చాలా హాట్ హాట్ ఫోజులతో కూడిన ఫోటోలనే పెడుతుంటుంది. అందుకే ఆమెకి 5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ఇన్ స్టాగ్రామ్లో.
ఐతే ఈ అకౌంట్ హ్యాక్ అయిందట. ఎవరూ ఈ అకౌంట్ని ఓపెన్ చేయొద్దు అని ముందే తన అభిమానులను హెచ్చిరించింది. త్వరలోనే రిస్టోర్ చేసుకుంటానని చెప్పింది. జనరల్గా హ్యక్ అయిన అకౌంట్లలో బూతు బొమ్మలను అప్లోడ్ చేస్తుంటారు హ్యకర్స్. లక్కీగా రకుల్కి ఆ ప్రమాదం కలగలేదు.
వానపాటల్లో "ఆకుచాటు పిందె తడిసే" పాట ఎంతో పాపులర్. "వేటగాడు" సినిమా కోసం ఎన్టీఆర్, శ్రీదేవిలపై దర్శకరత్న కె.రాఘవేంద్రరావు చిత్రీకకరించిన ఈ పాటని ఇపుడు ఎన్టీఆర్ బయోపిక్లో మళ్లీ చూడబోతున్నాం. 1979లో వేటగాడు విడుదలైంది. అంటే దాదాపు 39 ఏళ్ల తర్వాత అదే పాటని మనం కొత్తగా చూడబోతున్నాం.
ఎన్టీఆర్ బయోపిక్లో ఎన్టీఆర్గా ఆయన కుమారుడు బాలయ్య,శ్రీదేవిగా రకుల్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాటని దర్శకుడు క్రిష్ హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. పాట స్టిల్ని తాజాగా విడుదల చేశారు. బాలయ్య, రకుల్పై తీస్తున్న ఈ వాన పాట సినిమాకి హైలెట్ కానుందట.
రకుల్ ప్రీతిసింగ్, మంచు లక్ష్మీ స్నేహితురాళ్లు. వారిద్దరూ తమ మధ్య ఉన్న అప్యాయతని బహిరంగంగానే వ్యక్తపరుచుకుంటారు తరుచుగా సోషల్ మీడియా వేదికగా. స్నేహన్ని ఒక్కొక్కరు ఒక్కో తీరుగా జనాలకి చూపుతుంటారు. అందులో తప్పేమీలేదు. ఐతే సెలబ్రిటీలు చేసే కొన్ని చర్యలు కొంత అతిగా అనిపిస్తుంటాయి. అలాంటిదే తాజాగా రకుల్ షేర్ చేసిన ఫోటో.