సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి నందమూరి అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి. దీనికి తోడు ఈ బయోపిక్ లో స్వయంగా తమ నటసింహం బాలయ్య బాబు నటిస్తాడంటూ వార్తలు రావడంతో అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వీళ్ల భయానికి ఒకే ఒక్క కారణం వర్మ.
ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తానని ప్రకటించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎన్టీఆర్ శత్రువులెవరో, నమ్మక ద్రోహులెవరో, కాంట్రవర్సీల వెనకున్న అసలు మేటరేంటో.. ఇలా అన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి చూపిస్తాననని తనదైన స్టయిల్ లో చెబుతున్నాడు వర్మ. కానీ వర్మకు అంత దమ్ముందా అనేదే ఇక్కడ మెయిన్ టాపిక్.
ప్రస్తుతం దేశమంతా బాహుబలి-2 మేనియా కొనసాగుతోంది. టాలీవుడ్ లో అయితే ఈ సినిమా తప్ప మరో మూవీ కనుచూపు మేరలో లేదు. అటు బాలీవుడ్ లో మాత్రం రేపట్నుంచి మరో మూవీ సందడి చేయబోతోంది. అదే సర్కార్ 3. బిగ్ బి అమితాబ్ నటించిన ఈ సినిమా బాహుబలి-2 నుంచి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంటుందా.. బిగ్ బి-వర్మ కలిసి బాహుబలి మేనియాను అడ్డుకోగలరా...