సూపర్స్టార్ రజనీకాంత్, అక్షయ్కుమార్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న విజువల్ వండర్ "2.0." ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చారు ఈ త్రయం.
ఈ సినిమా భారతీయ చిత్రరంగం గర్వపడే విధంగా రూపొందిందని రజనీకాంత్ అన్నారు.
"రోబో విడుదలై ఎనిమిదేళ్లు అవుతుంది. ఆ సినిమా ఆడియో సమయంలో శంకర్గారు నాకు తెలుగు తెలియదని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇప్పుడు ఆయన చాలా చక్కగా తెలుగులో మాట్లాడటం నేర్చుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తెలుగు జనాలు చాలా మంచివాళ్లు. వాళ్లని అందరూ ఇష్టపడతారు", ఇలా తెలుగువారిని పొగిడేశాడు రజనీకాంత్.
తమిళ అగ్ర దర్శకుడు శంకర్కి సీక్వెల్స్ పిచ్చి పట్టుకున్నట్లుంది. ఇప్పటికే రోబోకి సీక్వెల్గా 2 పాయింట్ ఓ తీశాడు. ఇక కమల్హాసన్తోనే భారతీయుడు 2 మొదలుపెట్టాడు. భారతీయుడు సినిమాకి సీక్వెల్గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం అవుతుంది. ఇలా వరుసగా రెండు సీక్వెల్స్తోనే ఆపడం లేదు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే .. ఆ తర్వాత ఒకే ఒక్కడు సినిమాకి సీక్వెల్ తీస్తానని తాజాగా శంకర్ ప్రకటించాడు.