త్వరలోనే "యాత్ర" సినిమా విడుదల కానుంది. మమ్మూట్టి వైఎఎస్సార్గా నటించిన సినిమా యాత్ర. ఈ సినిమా షూటింగ్ని మమ్మూట్టి ఎపుడో పూర్తి చేశారు. దాంతో ఆయన తన పంథాలో తన మలయాళ సినిమాలు చేసుకుంటున్నారు. 67 ఏళ్ల మమ్మూట్టి ఇప్పటికీ చాలా బలిష్టింగా కనిపిస్తారు. ఆయన ఓ పదేళ్లు యంగ్గా ఉంటారు. 40 ఏళ్ల వాడి ఎనర్జీని చూపుతారు. ఇపుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే ఆయన సెక్సీ భామ సన్నీ లియోన్తో డ్యాన్స్ చేస్తున్నాడు. సన్నీతో అలా చేయాలంటే ఎంత ఎనర్జీ ఉండాలి మరి.
సన్నీలియోన్ కనిపిస్తే మాస్లో టికెట్లు తెగుతాయి. హాట్నెస్కి మారుపేరు సన్నీ. అందుకే సన్నీలియోన్తో ఐటెంసాంగ్లు చేయించేందుకు ఫిల్మ్మేకర్స్ తెగ ఆసక్తి చూపుతుంటారు. కాకపోతే, ఆమె పారితోషికం చాలా ఎక్కువ. ఆమెకి ఇచ్చే రేట్లో మరో తెలుగు హీరోయినో, తమిళ భామనో తీసుకొని పాట చేయించుకోవచ్చు. అందుకే సన్నీలియోన్తో సెలక్టివ్గా ఐటెంసాంగ్లు చేయిస్తుంటారు.
ఒకపుడు మేడం టుస్సాడ్స్లో ఒక సెలబ్రిటీ మైనపు విగ్రహం పెడుతున్నారంటే అదొక గౌరవం. ఆ స్టార్ పాపులారిటీకి నిదర్శనం. కానీ రీసెంట్గా సీన్ మారింది. మేడం టుస్సాడ్స్ మ్యూజియం కూడా కమర్షియల్ బాట పట్టింది. ప్రతి దేశంలో ఒక మ్యూజియం పెట్టేస్తోంది. లండన్, న్యూయార్క్ నుంచి తాజాగా బ్యాంకాక్, ఢిల్లీకి కూడా వచ్చింది. ఇన్ని మ్యూజియంలను నడపాలంటే కొత్త కొత్త సెలబ్రిటీలు కావాలి, వారి మైనపు విగ్రహాలు కావాలి కదా. అందుకే ప్రతి నెలకో బాలీవుడ్ సెలబ్రిటీని పిలిచి ఒక మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తోంది మేడం టుస్సాడ్స్.