నందమూరి బాలకృష్ణ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం మొదలు పెట్టాడు. హైదరాబాద్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్న చోట క్యాంపెయినింగ్ చేస్తున్నాడు. చంద్రబాబు వద్దు అంటే ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ కూడా వద్దనాలి అంటూ మొదటి రోజు ఆవేశంగా స్పీచ్ ఇచ్చిన బాలయ్య రెండో రోజు...తెలంగాణ సీఎం కేసీఆర్కి సవాల్ విసిరాడు.
నందమూరి సుహాసిని కోసం నందమూరి బాలకృష్ణ ప్రచారంలోకి దిగాడు. ఆమెతో పాటు ఇతర తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల తరఫున మరో రెండు రోజులు ప్రచారం చేయనున్నాడు బాలయ్య. ఐతే, సుహాసిని కోసం కల్యాణ్రామ్, జూనియర్లో చివరి నిమిషంలో రంగంలోకి దిగుతారని ఇప్పటి వరకు టాక్ నడిచింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఇద్దరూ ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.
విజయశాంతి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయనర్గా ప్రచార రంగంలోకి దిగారు. తెలంగాణలో ఆమె ప్రచారం చేస్తున్నారు కానీ ఆమెకి ప్రచారం దక్కడం లేదు. జనరల్గా స్టార్ క్యాంపెయనర్ల ప్రచారానికి మీడియా ఎక్కువ కవరేజ్ ఇస్తూ ఉంటుంది. కానీ రాములమ్మ ప్రచారానికి మీడియాలో పెద్దగా చోటు దక్కడం లేదు.
కమెడియన్ వేణుమాధవ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆ మధ్య నంద్యాల ఉప ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ఐతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లేట్గా నిర్ణయం తీసుకున్నాడో లేదో పార్టీ అతనికి టికెట్ నిరాకరించిందో తెలియదు కానీ ఇపుడు బరిలో నిలిచాడు. సొంత ఊరు అయిన కోదాడలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు వేణుమాధవ్.
రాజకీయ పరిశీలకులు ఊహించినట్లే.. నందమూరి హరికృష్ణ కూతురిని ఎన్నికల బరిలోకి దింపుతోంది తెలుగుదేశం పార్టీ. హరికృష్ణ కూతురు సుహాసిని పేరుని కూకట్పల్లి అభ్యర్థిగా ఆ పార్టీ గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. నందమూరి కుటుంబం నుంచి తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతున్న తొలి వ్యక్తిగా సుహాసిని నిలవనున్నారు. ఆమె మామ చుండ్రు శ్రీహరి మాజీ ఎంపీ.
నందమూరి కల్యాణ్రామ్ని ఈసారి తెలంగాణ ఎన్నికల బరిలో దింపాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లోని కీలకమైన నియోజకవర్గమైన కూకటపల్లి నుంచి కల్యాణ్రామ్ని బరిలోకి దింపాలని ఇంతకుముందు ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు. ఐతే కల్యాణ్రామ్ ఈ ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించాడు.