Prabhas is restless! A lot of money is at stake on ‘Saaho’ that hits the screens worldwide on August 30, 2019. The actor wants the film to succeed at any cost. He tells us why he did Saaho and much more…
ఇక పడ్డ తిప్పలు చాలు..ఇకపై రిస్క్ తీసుకోను అంటున్నాడు యంగ్ రెబెల్స్టార్ ప్రభాస్. ఒక్కో సినిమాకి రెండేళ్లు, మూడేళ్లు పడుతుండడంతో ప్రభాస్కి విసుగొచ్చింది. బాహుబలి చిత్రాలకి అన్ని ఏళ్లు కష్టపడడం నచ్చిందట. ఎందుకంటే ఈ రోజు వచ్చిన ఫేమ్ అంతా దాని పుణ్యమే కదా. ఐతే సాహో వంటి చిత్రాల మేకింగ్ తర్వాత మాత్రం ఇంత రిస్క్ ఇకపై వద్దనుకుంటున్నాడు.
"టాక్సీవాలా" సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అవుతోంది ప్రియాంక జవాల్కర్. అనంతపురంలో పుట్టిపెరిగిన ఈ మరాఠీ అమ్మాయి, "టాక్సీవాలా" కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. దీంతో ప్రియాంకపై మీడియా ఫోకస్ పడింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియాంక.. దర్శకుడు తనను వేధించాడని అంటోంది. దర్శకుడి దెబ్బకు తను బలైపోయానని అంటోంది.
"దర్శకుడు రాహుల్ పెర్ఫెక్షన్ కు నేను ఎక్కువ బలయ్యాను. ప్రతి షాట్ పెర్ఫెక్ట్ గా కావాలంటాడు. హెడ్ టర్న్ కూడా పెర్ఫెక్ట్ గా కావాలంటాడు. కానీ ఎప్పుడూ రాహుల్ తన టెంపర్ కోల్పోలేదు. సహనంగా అన్నీ చెప్పేవారు."
రాజకీయ నాయకులైనా... సినిమా సెలబ్రిటీలైనా మీడియా ద్వారా ప్రచారం లేకపోతే ప్రజల్లోకి వెళ్లలేము అని బలంగా నమ్ముతారు. మనసులో ఎలా ఉన్నా మీడియాను చేరదీసి తమకు సంబంధించిన వార్తలు వచ్చేలా చూసుకొంటారు. అది వ్యతిరేకమైనా, అనుకూలమైనా ఏదొకలా వార్తల్లో ఉండాలని నాయకులు భావిస్తారు. ఎప్పుడూ తమను పొగుడుతూ చిడతలు కొట్టేలా వార్తలు ఇవ్వాలని సినీ జనాలు కోరుకొంటారు. సినిమాకు కొబ్బరికాయ కొట్టక ముందు నుంచి వెండి తెర మీద బొమ్మపడి పది రోజులు నిలబడేవరకూ ఆ బొమ్మ గురించి దిమ్మ తిరిగే కవరేజి కోసం తపిస్తుంటారు. కానీ ప్రముఖ దర్శకుడు రాజమౌళికి మాత్రం తెలుగు మీడియాపై కొంత చులకన భావం ఏర్పడిందట.