మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి సునీల్కి ఒక ప్రశ్న ఎదురవుతుంటుంది. త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడంటూ అతన్ని క్వశ్చన్ చేయడం కామన్. ఎందుకంటే వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మరి. అందుకే ఎంతమంది అడిగినా ఈ విషయంపై ఓపిగ్గా రియాక్ట్ అవుతాడు సునీల్. తాజాగా త్రివిక్రమ్ తీసిన షఅజ్ఞాతవాసి సినిమాపై సునీల్ రెస్పాండ్ అయ్యాడు. క్యారెక్టర్ నచ్చక అజ్ఞాతవాసి నుంచి తప్పుకున్నట్టు తెలిపాడు.
అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లో పవన్ తర్వాత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు హీరోయిన్లు కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్. వీళ్లలో అను ఎమ్మాన్యుయేల్ మోడ్రన్ లుక్ లో కనిపించే శారీలో కనువిందు చేసింది. ఎటొచ్చి కీర్తి సురేష్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓ డిఫరెంట్ లుక్, గెటప్ తో ఆడియో ఫంక్షన్ కు వచ్చి అందరికీ షాకిచ్చింది కీర్తిసురేష్. ఎప్పుడు చూసినా అందంగా, ఆకర్షణీయంగా కనిపించే కీర్తి, ఈసారి మాత్రం ముమైత్ ఖాన్ ను ఫాలో అయింది.
పవన్ కెరీర్ పై ఇప్పుడు భారీ చర్చ నడుస్తోంది. పవర్ స్టార్ సినిమాల నుంచి తప్పుకుంటాడా.. లేక అజ్ఞాతవాసి తర్వాత తన 26వ సినిమాను ప్రకటిస్తాడా..? ఫిలింనగర్ లో అందరి ఆలోచనలు ఈ దిశగానే సాగుతున్నాయి.
తాజాగా జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో పవన్ నిర్ణయం వెల్లడిస్తాడని అంతా ఎదురుచూశారు. సుదీర్ఘంగా ప్రసంగించడం కోసమే ప్రత్యేక అతిథుల్ని ఆహ్వానించలేదనే ప్రచారం కూడా జరిగింది. కానీ పవన్ ఈసారి కూడా తన కెరీర్ ను ప్రశ్నార్థకంగానే మిగిల్చాడు. నెక్ట్స్ సినిమాపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అలా అని సినిమాల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పలేదు.