వెన్నెల కిషోర్, అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ వీళ్లంతా ఓ బ్యాచ్. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. ఓపెన్ గా ఒకరిపై ఒకరు పంచ్ వేసుకుంటారు. మరీ ముఖ్యంగా ట్విట్టర్ లో శేష్ పై పంచ్ లు కామన్. వెన్నెల కిషోర్ ఓ పంచ్ వేస్తాడు. దానికి రాహుల్ రవీంద్రన్ మసాలా దట్టిస్తాడు. ఫైనల్ గా శేష్ బుక్ అవుతాడు. అయితే ఈసారి మాత్రం వెన్నెల కిషోర్ ను ఆడుకునే ఛాన్స్ శేష్ కు వచ్చింది.
వెన్నెల కిషోర్ మంచి భోజన ప్రియుడు. కానీ ఫుడ్ విషయంలో అతడిది రొట్ట టేస్ట్ అంటున్నాడు అడవి శేష్. అమెరికాలో దొరికే వేస్ట్ ఫుడ్ అంటే వెన్నెల కిషోర్ ఎగబడి తింటాడని, అదేం టేస్టో తనకు అర్థంకాదంటాడు.
ఓ దశాబ్దం క్రితం హీరోయిన్గా వెలిగిన లయ ఇపుడు అమెరికాలో సెటిల్ అయింది. ఆమె భర్త ఎన్నారై. లయ హోమ్మేకర్గా జీవనం సాగిస్తోంది. ఇటీవల లయ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. ఆ సినిమాని కూడా అమెరికాలోనే చిత్రీకరించారు. లయ గెస్ట్రోల్లాంటి పాత్రలో దర్శనమిచ్చింది. అలాగే ఆమె కూతురు కూడా ఈ సినిమాలో నటించింది. నిజ జీవితంలో పదేళ్ల కూతురికి ఆమె తల్లి. ఐతే సినిమా తెరపై అపుడే అమ్మ పాత్రల్లోకి రానంటోంది.
"అజ్ఞాతవాసి", "నా పేరు సూర్య" సినిమాల్లో అవకాశం వచ్చినపుడు అను ఇమ్మాన్యుయేల్ ఎక్కడికో వెళ్తుందనిపించింది. అగ్ర హీరోయిన్ల జాబితాలో ఖాయంగా ఉంటుందనుకున్నారంతా. కానీ రెండు సినిమాలు మెగా ఫ్లాప్ కావడంతో ఆమె ఆశలు గల్లంతయ్యాయి. అవకాశాలు తగ్గాయి. ఇపుడు చేతిలో ఒకే ఒక్క మూవీ ఉంది.
నితిన్ ఇపుడు అమెరికాలో ఉన్నాడు. దర్శకుడు కృష్ణ చైతన్య తీస్తున్న కొత్త సినిమాలో నటిస్తున్నాడు. మంచి కథతో రూపాందుతోంది ఈ మూవీ. "గుర్తుందా శీతాకాలం" అనే రొమాంటిక్ పేరుని కూడా పరిశీలిస్తున్నారు ఈ మూవీకి. అయితే ఇపుడు మేటర్ దాని గురించి కాదు నితిన్ లవ్ మీటర్ గురించి.
అవును.. లవర్బాయ్ నితిన్ రియల్లైఫ్లో డేటింగ్ షురూ చేశాడని వెబ్లోకంలో వార్త వచ్చింది. షికారు చేస్తున్నఈ వార్త పుకారా? నిజమా అన్నది ఇపుడే చెప్పలేం. ఈ మధ్య ఏది వైరలో ఏదో రియలో తెలియని విధంగా యూట్యూబ్ వార్తలు జనాలకి షాక్లిస్తున్నాయి.