"టాక్సీవాలా" సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అవుతోంది ప్రియాంక జవాల్కర్. అనంతపురంలో పుట్టిపెరిగిన ఈ మరాఠీ అమ్మాయి, "టాక్సీవాలా" కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. దీంతో ప్రియాంకపై మీడియా ఫోకస్ పడింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియాంక.. దర్శకుడు తనను వేధించాడని అంటోంది. దర్శకుడి దెబ్బకు తను బలైపోయానని అంటోంది.
"దర్శకుడు రాహుల్ పెర్ఫెక్షన్ కు నేను ఎక్కువ బలయ్యాను. ప్రతి షాట్ పెర్ఫెక్ట్ గా కావాలంటాడు. హెడ్ టర్న్ కూడా పెర్ఫెక్ట్ గా కావాలంటాడు. కానీ ఎప్పుడూ రాహుల్ తన టెంపర్ కోల్పోలేదు. సహనంగా అన్నీ చెప్పేవారు."
రాజకీయ నాయకులైనా... సినిమా సెలబ్రిటీలైనా మీడియా ద్వారా ప్రచారం లేకపోతే ప్రజల్లోకి వెళ్లలేము అని బలంగా నమ్ముతారు. మనసులో ఎలా ఉన్నా మీడియాను చేరదీసి తమకు సంబంధించిన వార్తలు వచ్చేలా చూసుకొంటారు. అది వ్యతిరేకమైనా, అనుకూలమైనా ఏదొకలా వార్తల్లో ఉండాలని నాయకులు భావిస్తారు. ఎప్పుడూ తమను పొగుడుతూ చిడతలు కొట్టేలా వార్తలు ఇవ్వాలని సినీ జనాలు కోరుకొంటారు. సినిమాకు కొబ్బరికాయ కొట్టక ముందు నుంచి వెండి తెర మీద బొమ్మపడి పది రోజులు నిలబడేవరకూ ఆ బొమ్మ గురించి దిమ్మ తిరిగే కవరేజి కోసం తపిస్తుంటారు. కానీ ప్రముఖ దర్శకుడు రాజమౌళికి మాత్రం తెలుగు మీడియాపై కొంత చులకన భావం ఏర్పడిందట.
ఈ రిలేషన్ చెప్పుకోవడానికి కాస్త వింతగా, కొత్తగా ఉన్నప్పటికీ నిజం. ఎన్టీఆర్ ను అల్లు అర్జున్ బావ అనే పిలుస్తాడు. ఈ విషయాన్ని స్వయంగా బన్నీనే బయటపెట్టాడు. టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో బన్నీ ఇలా బయటపడ్డాడు.
"ట్రిపుల్ ఆర్ ఫిలిం లాంఛ్ అయింది. నా ఫేవరెట్ మెగాపవర్ రామ్ చరణ్ గారికి, నా బావ తారక్ కు, రాజమౌళి గారికి ఆల్ ది బెస్ట్. నేను తారక్ ను సరదాగా బావ అని పిలుస్తుంటాను."
తను ఏ సినిమా స్టార్ట్ చేసినా కొబ్బరికాయ కొట్టిన రోజే కథను కాస్త రివీల్ చేయడం రాజమౌళి స్టయిల్. ఈగ సినిమా ఓపెనింగ్ రోజైతే టోటల్ కథ మొత్తం చెప్పేశాడు. మర్యాదరామన్న టైమ్ లో కూడా స్టోరీలైన్ బయటపెట్టాడు. బాహుబలికి కూడా ట్విస్టులు చెప్పకపోయినా స్టోరీలైన్ చెప్పేశాడు. సో.. తన నెక్ట్స్ సినిమా కథ ముందే చెబుతాడని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.