డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి ముందస్తు ఎన్నికలు. ఇంత ముందస్తుగా ఎన్నికలు వస్తాయని ఊహించని జనసేన ఇపుడు పోటీ పడేందుకు తర్జన భర్జన పడుతోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడదనేది ఖాయంగా తెలుస్తోంది. ఐతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంటున్నారు. పార్టీలో చర్చించి రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఐతే తమ పార్టీ ప్రధానంగా ఫోకస్ ఏపీపైనే పెడుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి పూర్తిగా రెడీగా ఉన్నామని అంటున్నారు.
రేవతి అని హెడ్లైన్ చూసి... మౌనరాగం, గాయం, అంకురం చిత్రాల నటి అనుకోవద్దు. రేవతి చౌదరి అనే వర్ధమాన నటి గురించి ఈ ప్రస్తావన. శివాజీ హీరోగా రూపొందిన ఓ సినిమాలోనూ, తారకరత్న సరసన కాకతీయుడు చిత్రంలోనూ నటించింది రేవతి చౌదరి. ఆమె పుట్టింది, పెరిగింది విజయవాడలోనే కానీ చాలా కాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నందున ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరింది. అన్నట్లు ఆమె నటించిన ఆ రెండూ సినిమాలు విడుదలకి నోచుకోలేదట!