"సర్..సర్లే ...ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని జరుగుతాయా ఏమిటి" అని వీరభద్ర సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక డైలాగ్ చెపుతాడు. ఆ సినిమాలో బండ్ల గణేష్ కూడా నటించాడు. ఇపుడు బండ్ల గణేష్ రియల్లైఫ్లో బాలయ్య డైలాగ్ వల్లిస్తున్నాడు.
ఎన్నికల టైమ్లో వంద అంటాం.. అన్నీ చేస్తామా? ఏమిటి? అని తాజాగా స్పందించాడు బండ్ల గణేష్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని జర్నలిస్ట్లతో, మీడియాతో బెట్టింగ్లు కట్టాడు బండ్ల. అంతేకాదు, ఒకవేళ తెరాస గెలిస్తే సెవన్ ఓ క్లాక్ బ్లేడ్తో తన గొంతు కోసుకుంటా అని శపథం చేశాడు.
తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త చరిత్రని సృష్టించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెరాస క్లీన్ స్వీప్ చేసింది. 88 స్థానాల్లో విజయం సాధించింది. గులాబీ బాస్ కేసీఆర్కి ప్రధాని మోదీ సహా అగ్రనేతలంతా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. జనసేనాని పవన్ కల్యాణ్ హైదరాబాద్లో లేకపోవడంతో ప్రత్యేకంగా ప్రెస్నోట్తో తన అభినందనలను అందించారు.
తెలంగాణ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు తెలపనున్నారు. ఈ మేరకు ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారని తెలుగుసినిమా.కామ్ ఇంతకముందే వార్తను ప్రచురించింది. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సారాంశం అదే.
తెలంగాణకి షెడ్యూల్ కన్నా ముందే ఎన్నికలు వచ్చినందున ఈ సారి తమ పార్టీ పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ ఇంతకుముందే ప్రకటించాడు. ఇక తాజాగా ఆయన తమ పార్టీ అభిమానులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తున్నాడు.
అల్లు అర్జున్ భార్య స్నేహ తండ్రి కె.చంద్రశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ నేత. అయితే ఇది ఎన్నికల టైమ్. టికెట్ రాని వారంతా జంపింగ్ చేసే కాలమిది. బన్ని మామ కూడా తెలంగాణ రాష్ర్ట సమితికి హ్యండిచ్చి కాంగ్రెస్ హస్తం అందుకుంటాడనే టాక్ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇబ్రహీం పట్నం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై గెలిచిన తెలుగుదేశం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆ తర్వాత బంగారు తెలంగాణ కోసం సైకిల్ వీడి కారు ఎక్కారు. తెరాసలోకి మంచిరెడ్డి వచ్చినా.. బన్ని మామ అదే పార్టీలో కొనసాగారు.
హీరో అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్నేహారెడ్డి కుటుంబం అంతా రాజకీయ నేపథ్యం ఉన్నవారే. స్నేహారెడ్డి తండ్రి శేఖర్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ ఎస్లో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇబ్రహీం పట్నం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మంచిరెడ్డి కిషన్రెడ్డి చేతుల్లో ఓడిపోయారు ఆయన. ఆ తర్వాత మంచి రెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ ఎస్ ఆకర్ష్ పథకానికి ఆకర్షితుడయి ఆ పార్టీలో చేరారు. మరోసారి ఆయనే అక్కడ పోటీ చేయనున్నారు..అదీ కూడా ఈ సారి టీఆర్ ఎస్ టికెట్పై. దాంతో అల్లు అర్జున్ మామకి అక్కడ ఛాన్స్ లేదు.
పవర్స్టార్ పవన్ కల్యాణ్ ఎపుడూ సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటారు. కొత్త సంవత్సరం తొలి రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో జనసేన అధినేత గంటన్నర సేపు భేటీ కావడం అతిపెద్ద సర్ప్రైజ్. ఈ భేటి ఏపీ, తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
కేసీఆర్తో పవర్స్టార్కి ఇంతకుముందు ప్రత్యేకమైన స్నేహబంధం లేదు. గత ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత కూడా కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగానే ప్రచారం చేశారు పవర్స్టార్. ఐతే ఇపుడు సడెన్గా కలవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అసలు పవన్ కల్యాణ్ కేసీఆర్ని ఎందుకు కలిశారు? అసలు రీజన్ ఏంటి