"సర్..సర్లే ...ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని జరుగుతాయా ఏమిటి" అని వీరభద్ర సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక డైలాగ్ చెపుతాడు. ఆ సినిమాలో బండ్ల గణేష్ కూడా నటించాడు. ఇపుడు బండ్ల గణేష్ రియల్లైఫ్లో బాలయ్య డైలాగ్ వల్లిస్తున్నాడు.
ఎన్నికల టైమ్లో వంద అంటాం.. అన్నీ చేస్తామా? ఏమిటి? అని తాజాగా స్పందించాడు బండ్ల గణేష్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని జర్నలిస్ట్లతో, మీడియాతో బెట్టింగ్లు కట్టాడు బండ్ల. అంతేకాదు, ఒకవేళ తెరాస గెలిస్తే సెవన్ ఓ క్లాక్ బ్లేడ్తో తన గొంతు కోసుకుంటా అని శపథం చేశాడు.
ఎమ్మెల్యేగా అధికారం చేపట్టాలని కలలు కన్నాడు నటుడు బండ్ల గణేష్. గత రెండు నెలలుగా ఎంతో కామెడీ పండించాడు. ఎమ్మెల్యేగా సీటు గ్యారెంటీ అనుకున్నాడు. బండ్ల గణేష్ తరఫున మీడియా యజమాని ఎంత లాబీయింగ్ చేసినా..కాంగ్రెస్ పార్టీ మాత్రం మొండిచెయ్యి చూపింది. ఐతే ఎమ్మెల్యేగా అధికారం బదులు అధికార ప్రతినిధిగా అధికారం ఇచ్చింది.
ఇక బండ్ల గణేష్..మీడియాతో కాంగ్రెస్ పార్టీ తరఫున అఫీషియల్గా మాట్లాడొచ్చు. కేసీఆర్..పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు అని తనదైన పరిజ్ఞానంతో ప్రశ్నించొచ్చు (ఇంతకుముందు ఒక సారి ఇలాగే అడిగాడు మరి!).
హెడ్డింగ్ చాలా హార్ష్గా ఉంది కదూ. అవును. కానీ ఈ మాట మేమంటున్నది కాదు. తెలంగాణవాదులు, తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో బండ్ల గణేష్ని ఇలా ట్రాల్ చేస్తున్నారు. షాద్నగర్కి చెందిన బండ్ల గణేష్ కోళ్ల ఫారమ్ వ్యాపారంలో కోట్లు గడించాడు. ఆ తర్వాత నిర్మాతగా కూడా రాణించాడు. ఇపుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కాంగ్రెస్ తరఫున వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.
పవర్స్టార్ పవన్ కల్యాణ్ నా దేవుడు అంటూ ఎపుడూ ఊగిపోయే బండ్ల గణేష్ పాలిటిక్స్లోకి వచ్చాడు. సహజంగానే బండ్ల గణేష్ ఎర్ర తువ్వాల తన మెళ్లో వేసుకుంటాడనుకుంటారు. కానీ ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. జనసేన పార్టీలో చేరకుండా, కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నాడు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.