నందమూరి హరికృష్ణ అకాల మరణంతో జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా విడుదల తేదీ మారుతుందా? ఇదే ప్రశ్న అభిమానుల మదిలో మొదలుతోంది. దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిస్తోన్న "అరవింద సమేత" ఈ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఐతే తన తండ్రి హరికృష్ణ మరణంతో.. జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల పాటు షూటింగ్కి దూరంగా ఉండక తప్పదు.
స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమారుడిగా హరికృష్ణ తెలుగు దేశం పార్టీ నేతలకి అత్యంత ప్రియమైన వ్యక్తి. పాత తరం రాజకీయ నాయకులు.. ఆయన్ని చైతన్య రథసారథిగా అభిమానిస్తారు. సినిమా పరిశ్రమ వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్టీఆర్ ..ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించారు. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం షెవర్లెట్ వాహనాన్ని మాడిఫై చేసి, దానికి చైతన్య రథం అనే పేరు పెట్టారు ఎన్టీ రామారావు. ఆ బస్సు స్టీరింగ్ని చేపట్టింది ఎవరో కాదు ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణనే.
త్రివిక్రమ్ తీస్తున్న "అరవింద సమేత"లో పూజా హెగ్డే పాత్ర పేరు అరవింద. అరవిందని దక్కించుకునేందుకు వీర రాఘవుడి చేసే పోరాటమే ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్. విడుదలైన తొలి టీజర్లో వీర రాఘవుడి విశ్వరూపం చూశాం. కానీ టీజర్లో ఒక్క ఫ్రేమలోనూ అరవింద అర విందం కూడా కనిపించలేదు. అందుకే కాబోలు తాజాగా పూజా సినిమా సెట్లోని ఒక ఫోటోని షేర్ చేసింది.