ఎన్టీఆర్ బయోపిక్ని వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేస్తామని దర్శకుడు క్రిష్ ఇప్పటికే ప్రకటించారు. ఐతే ఇంత భారీ సినిమాని అంత స్పీడ్గా పూర్తి చేయగలరా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని క్రిష్ వద్ద ప్రస్తావించాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 9న విడుదల చేయాలని చంద్రబాబు క్రిష్కి, బాలయ్యకి స్పష్టం చేశాడట.
మహేష్బాబు, రామ్చరణ్, ఎన్టీఆర్ల మధ్య స్నేహబంధం మరింత బలపడింది. గత ఏడాది, ఏడాదిన్నర కాలంగా ఈ త్రిమూర్తులు రెగ్యులర్గా కలుసుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు. రామ్చరణ్, ఎన్టీఆర్ మధ్య అంతకుముందు నుంచే ఫ్రెండ్సిప్ ఉంది. అంతేకాకుండా, చరణ్, ఎన్టీఆర్ త్వరలో కలిసి రాజమౌళి సినిమాలో నటించనున్నారు. దాంతో ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య స్నేహం పెరిగింది. పిల్లల బర్త్డేల పార్టీలకి వెళ్లడం, వారికి సోషల్ మీడియాలో వీడియో సందేశాలు ఇవ్వడం కూడా చేస్తున్నారు.
నటసార్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్లో నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ చిన్న పాత్రలో కనిపించనున్నారు. కైకాల తన కెరియర్ని ఎన్టీ రామారావుకి డూప్ నటించడంతోనే ప్రారంభించారు. అదే ఎన్టీఆర్ బయోపిక్లో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నారు.
తెలుగు సినిమా పితామహుడు అయిన హెచ్.ఎం.రెడ్డి పాత్రను పోషిస్తున్నారు కైకాల. కైకాల సత్యనారాయణ యన్.టి.ఆర్ బయోపిక్ లో హెచ్.ఎం.రెడ్డిగా అద్భుతంగా నటించారట. ఆయన పాత్రకి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. కైకాల సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన లుక్ ను నేడు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు దర్శకుడు.
జూనియర్ ఎన్టీఆర్కిపుడు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస విజయాలతో అన్ని వర్గాలకి చేరువయి అయ్యాడు. సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ పొందాడు. ఆఖరికి మహేష్బాబులాంటి అగ్రహీరో కూడా జూనియర్ని తన సినిమా ఈవెంట్కి గెస్ట్గా పిలవాల్సి వచ్చింది. ఆ రేంజ్లో జూనియర్ ఇపుడు పాపులర్ అయ్యాడు. ఇక చరణ్తో ఎన్టీఆర్కున్న దోస్తీ కారణంగా మెగా ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్కి ఫిదా అయిపోయారు. అందుకే జూనియర్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
బాలీవుడ్ నటి విద్యాబాలన్ టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. ఆమె తొలి చిత్రం.. ఎన్టీఆర్ బయోపిక్.
ఎన్టీఆర్ బయోపిక్లో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్గా నటిస్తుండగా, ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపిస్తుంది. బుధవారం (జులై 18) నుంచి ఆమె షూటింగ్లో పాల్గొంటోంది. ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చిన విద్యాబాలన్ని బాలయ్య కుటుంబ సభ్యులు సాదారంగా ఆహ్వానించారు. ఆమెకి బసవతారకం వ్యక్తిత్వం, ఆమె నడక, నడత గురించి పూర్తిగా వివరించారు. అంతేకాదు, ఆమెకి ఒక అందమైన పట్టుచీరని బహుకరించారు.