అవును.. ప్రభాస్ కొత్త సినిమా కోసం కత్రినాకైఫ్ ను ట్రైచేస్తున్నారు. బహుశా ఈసారి కత్రినాకైఫ్ కాదనకపోవచ్చు. ఎందుకంటే బాహుబలి ప్రాజెక్టుతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇలాంటి హీరో సరసన నటిస్తే క్రేజ్ లోకల్ గానే ఫిక్స్ అయిపోకుండా, దేశవ్యాప్తం అవుతుంది. కత్రినాకు కావాల్సిందే అదే. కాకపోతే ఈ కాంబినేషన్ ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది.
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అమెరికాలో ఉన్నాడు. ఓవైపు బాహుబలి-2 సినిమాకు వస్తున్న ప్రశంసల్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు రిలాక్స్ అవుతున్నాడు. పనిలోపనిగా తన కొత్త సినిమా కోసం అమెరికాలోనే మేకోవర్ అవుతున్నాడంటూ వార్తలు కూడా వస్తున్నాయి. సరే... ఈ పుకార్లను కాసేపు పక్కనపెడితే ప్రభాస్ అప్ కమింగ్ మూవీపై మరో హాట్ న్యూస్ బయటకొచ్చింది. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సాహో సినిమా వచ్చేనెల 10 నుంచి సెట్స్ పైకి వస్తుందట. మేటర్ ఇంకా కన్ ఫర్మ్ కాకపోయినా.. ప్రస్తుతానికి ఇది ఫైనల్ అంటున్నాడు దర్శకుడు సుజీత్.
అంతా ఊహించినట్టే జరిగింది. 2 వారాలు గడిచేసరికి ఇండియా వైడ్ రికార్డుల్ని బాహుబలి-2 సినిమా తుడిచిపెట్టేస్తుందని అంతా ఊహించారు. ఇప్పుడదే జరిగింది. ఇండియావైడ్ సరికొత్త రికార్డు సృష్టించింది ఈ సినిమా. అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతరించింది.
ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన బాహుబలి-2 సినిమా ప్రతి ఏరియా నుంచి కళ్లుచెదిరే కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ పండిట్స్ కూడా కళ్లుతేలేస్తున్నారు. ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఈ సినిమా చరిత్ర సృష్టించింది. నైజాంలో ఫస్ట్ టైం 50కోట్ల షేర్ క్లబ్ క్రియేట్ చేసింది బాహుబలి-2. ఇప్పటివరకు ఇంత షేర్ అందుకున్న సినిమా ఇంకోటి రాలేదు. విడుదలైన 12 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 151.90 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.