హీరో సునీల్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడనేది తెలిసిన మ్యాటరే. లేటెస్ట్ గా ఆయన చనిపోయాడు అంటూ కొన్ని మీడియాల్లో వార్తలు ప్రసారం అయ్యాయి. దాంతో సునీల్ స్పందించాడు. "నేను బతికే ఉన్నాను. క్షేమంగా ఉన్నాను. విజయవాడలో సినిమా షూటింగ్ కోసం వచ్చాను. నా ఆరోగ్యం పై కొందరు మిత్రులు ఆందోళన చెందుతున్నట్లు నాకు తెలిసింది. అటువంటి పుకార్లు నమ్మవద్దు. అల్ ఈజ్ వెల్," అంటూ సునీల్ వివరణ ఇచ్చారు.
హీరోగా విశ్వప్రయత్నాలు చేశాడు. హీరోగా చేసిన తొలి సినిమా, మధ్యలో వచ్చిన మర్యాదరామన్న తప్ప మరేవీ పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఒక దశలో సునీల్ కు హీరోగా మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు కూడా వెనక్కి వెళ్లిపోయారు. దీంతో మరోసారి కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చాడు సునీల్. సో.. ఇక భవిష్యత్ మొత్తం బంగారుమయం అనుకున్నాడు. కానీ సునీల్ కు మరోసారి షాక్ తప్పలేదు.
ఈ ఏడాది సునీల్ మళ్లీ కమెడియన్ అవతారం ఎత్తాడు. హీరో వేషాలతో ఫ్లాప్లు రావడంతో అవి వదిలి కమెడియన్ వేషాలు వేస్తున్నాడు. ఐతే అవేవీ విజయాలను అందించడం లేదు. తాజాగా విడుదలైన "పడి పడి లేచే మనసు" సినిమాలోనూ ఎన్నారై బావగా నటించాడు. కానీ మునుపటి నవ్వులు లేవు. ఆ జోష్ లేదు. ఈ సినిమాకి క్రిటిక్స్ అంతా తంబ్స్ డౌన్ అన్నారు.
సునీల్ ఈ ఇయర్ నటించిన అరవింద సమేత, అమర్ అక్బర్ ఆంటోనీ, సిల్లీ ఫెలోస్... ఇలా ఏవీ వర్కవట్ కాలేదు. అరవింద సమేత విజయం సాధించినా.. సునీల్ పాత్ర డమ్మీ. ఆయనకి కమెడియన్గా కలిసొచ్చింది ఏమీ లేదు. 2018లోనూ సునీల్కి బ్యాడ్టైమే కనిపించింది.
కమెడియన్ గా రీఎంట్రీ ఇద్దామనుకుంటున్న హీరో సునీల్ కు సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా కలిసొస్తున్నట్టు లేదు. అల్లరి నరేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నా ఫలితం దక్కలేదు. మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అరవింద సమేతలో గుర్తుంచుకునే క్యారెక్టర్ ఇవ్వలేకపోయాడు. తాజాగా అమర్ అక్బర్ ఆంటోనీ కూడా సునీల్ కు ఏమాత్రం కలిసిరాలేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. స్వయంగా రవితేజ, శ్రీనువైట్ల తమ సినిమాలో సత్యకు మంచి పాత్ర దొరికిందని, వెన్నెల కిషోర్ పాత్ర హిలేరియస్ గా ఉంటుందని చెబుతున్నారు తప్ప, సునీల్ పాత్ర బాగా పండిందని చెప్పడం లేదు.