‘మా’వాళ్ళు ఏం చేసినా చిరిగి చేటంత అయి పేటంత కావాల్సిందే. అది వివాదం కావచ్చు... విరాళం కావచ్చు. శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకొనేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రూ.5 లక్షల చెక్కును ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చింది.
శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తొలి సినిమాతోనే బాలీవుడ్లో మంచి హీరోయిన్గా స్థిరపడింది. ధడక్ ఆమె నటించిన తొలి చిత్రం. ఆమెని తెలుగులో కానీ, తమిళంలో కానీ నటింపచేయాలని పలువురు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన ఆమెని నటింపచేసేందుకు అంతా ఓకే అయిందని ఇటీవల కొన్ని వెబ్సైట్లు వార్తలు ప్రచురించాయి. వీటిపై జాన్వీ కపూర్ వివరణ ఇచ్చింది.