It rained million dollars for Telugu movies in 2017.. Rajamouli's epic drama 'Baahubali 2' stands at top position with staggering $20 million. Check the complete list....
డ్రగ్స్ కేసులో సినిమా తారలను గంటల తరబడి విచారిస్తోంది సిట్ (స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్). అయితే ఈ కేసులో కేవలం సినిమా వారినే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాంగోపాల్ వర్మ ఇప్పటికే తప్పు పట్టాడు. తాజాగా ఆర్.నారయణ మూర్తి కూడా ఇదే అభిప్రాయం వెల్లడించాడు. డ్రగ్స్ విషయంలో సినిమా రంగాన్నే లక్ష్యం చేయడం సరికాదన్నారు నారాయణమూర్తి.
సినిమాలు తీసే మాకే సినిమాలు చూపిస్తున్నారని కౌంటర్ వేశారు నారాయణ మూర్తి.
టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ఈరోజు మరిన్ని మలుపులు తిరిగింది. ఇవ్వాల్సిన వాళ్లకు నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ పోలీసులు ఇప్పుడు ఒక్కో విషయాన్ని, ప్రతి ఒక్కరి రెస్పాన్స్ ను జాగ్రత్తగా గమనిస్తున్నారు. నిన్నటివరకు గుంభనంగా ఉన్న ఈ విషయంపై ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు.
పూరి జగన్నాథ్ ఏమన్నాడంటే..
“ఇప్పటివరకు నేను ఎవరిపైనా, దేనిపైనా ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతం పైసావసూల్ సినిమాను కంప్లీట్ చేయడంలో నేను చాలా బిజీగా ఉన్నాను.”
తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమీషనర్ అకున్ సభర్వాల్ తాజాగా మరో మేటర్ చెప్పారు. డ్రగ్స్ కేసుకి సంబంధించి టాలీవుడ్లో మొత్తం 16 మందికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. అందులో ఇద్దరు బ్యాంకాక్కి పారిపోయేందుకు ప్రయత్నిస్తే నిలిపివేశామని ప్రకటించారు.