టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ఈరోజు మరిన్ని మలుపులు తిరిగింది. ఇవ్వాల్సిన వాళ్లకు నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ పోలీసులు ఇప్పుడు ఒక్కో విషయాన్ని, ప్రతి ఒక్కరి రెస్పాన్స్ ను జాగ్రత్తగా గమనిస్తున్నారు. నిన్నటివరకు గుంభనంగా ఉన్న ఈ విషయంపై ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు.
పూరి జగన్నాథ్ ఏమన్నాడంటే..
“ఇప్పటివరకు నేను ఎవరిపైనా, దేనిపైనా ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతం పైసావసూల్ సినిమాను కంప్లీట్ చేయడంలో నేను చాలా బిజీగా ఉన్నాను.”
తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమీషనర్ అకున్ సభర్వాల్ తాజాగా మరో మేటర్ చెప్పారు. డ్రగ్స్ కేసుకి సంబంధించి టాలీవుడ్లో మొత్తం 16 మందికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. అందులో ఇద్దరు బ్యాంకాక్కి పారిపోయేందుకు ప్రయత్నిస్తే నిలిపివేశామని ప్రకటించారు.