వాణీ విశ్వనాథ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనేది పాత న్యూసే. మలబార్ తీరాన పుట్టిన ఈ కేరళ కుట్టి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హల్చల్ చేయనుంది. త్వరలోనే అధికారికంగా టీడీపీలో చేరుతుంది. అయిత పార్టీలో చేరకముందే...ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడేస్తోంది. రాంగోపాల్ వర్మపై విమర్శలు గుప్పించింది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ చరిత్రని తీస్తున్నా అని వర్మ ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు తెగ వర్రీ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇపుడు వాణీ విశ్వనాథ్ స్పందించింది.
బయోపిక్: ఆర్జీవీ పనిమనిషి వెర్సెస్ సోమిరెడ్డి పని మనిషి
ఈ మధ్య రాంగోపాల్ వర్మ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సంచలనాలు క్రియేట్ చేయడం లేదు. కానీ ఆయన తీసే ప్రతి సినిమా మీడియాకి మంచి వార్తాసరుకు అవుతుంది. వర్మ సినిమా తీసినంత కాలం మీడియాకి హెడ్లైన్స్ వెతుక్కోవాల్సిన పని ఉండదు. డిస్కషన్కి ఏ టాఫిక్ సెలక్ట్ చేసుకుందామని టీవీ చానెల్స్ తలపట్టుకోవాల్సిన అవసరమూ ఉండదు. కావాల్సినంత మెటిరీయల్ వర్మ అందిస్తాడు.