నాకంత సీన్లేదు అని నిజాయితీగా ఒప్పుకొంది తాప్సీ. బడాయికి పోకుండా నిజం అంగీకరించినందుకు తాప్సీని అప్రిషియేట్ చేయక తప్పదు. ఇంతకీ ఆమె అన్నమాట ఏంటంటే... తాను బాలీవుడ్లో ఏ లిస్ట్ స్టార్ని కాను. ఇంకా ఆ రేంజ్కి ఎదగలేదు అని చెప్పింది. ఏ లిస్ట్ స్టార్ అంటే టాప్ భామల్లో టాప్ అన్నమాట. దీపిక పదుకొనే, ఆలియ భట్, కంగన, ప్రియాంక చోప్రా..వంటి భామలు ఈ లిస్ట్లో ఉంటారు.
"బాహుబలి 2" తర్వాత ప్రభాస్ రేంజ్ హిమాలయ పర్వతాల స్థాయికి (పాపులారిటీ పరంగా) ఎదిగిందని చెప్పొచ్చు. బాహుబలి సినిమాలు ఆ రేంజ్లో హిట్టవ్వడానికి అసలు రీజన్ రాజమౌళి ప్రతిభాపాటవాలే అనడంలో డౌట్ ఏమీ లేదు. కానీ ఆ సినిమాలతో ప్రభాస్ మగువల మనసు దోచుకున్నాడనంలోనూ సందేహం అక్కర్లేదు. సౌత్, నార్త్ అనే తేడా లేదు ప్రభాస్ మేన్లీనెస్కి అమ్మాయిలంతా ఫిదా.
కొన్ని ఫేస్బుక్ ఐడీలు చూస్తే ఆశ్చర్యపోతాం... అమ్మాయిలు, ఆంటీలు ప్రభాస్ ఫోటోలను టాప్ పేజ్గా డెకరేట్ చేసుకొని హల్చల్ చేస్తున్నారు. ఈ భామలు ఎక్కువగా నార్త్ ఇండియన్ వారే కావడం విశేషం.
ప్రస్తుతం పూజా హెగ్డేపై అంతా ఇలాంటి బెట్టింగ్ లే కాస్తున్నారు. ఎందుకంటే తెలుగులో ఆమెకన్నీ ఫ్లాపులే వచ్చాయి. దీంతో గ్యాప్ కూడా అనివార్యమైంది. ఇలాంటి టైమ్ లో డీజే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వరించింది పూజాకు. ఈ సినిమా క్లిక్ అయితే ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ల రేసులోకి ఎంటర్ అవుతుంది. లేదంటే మాత్రం ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్ గా మరోసారి ఫేడవుట్ అవ్వడం ఖాయం.
శ్రీదేవికి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది తెలుగు సినీపరిశ్రమ. ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా తీసుకొచ్చిందే టాలీవుడ్. అలాంటి టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాలు చేసేందుకు అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు శ్రీదేవి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తన కూతురును కూడా ఇటువైపు చూడనీయట్లేదు. అవును.. శ్రీదేవి కూతురు జాన్వీ కూడా ఇప్పుడు బాలీవుడ్ పేరే కలవరిస్తోంది.
తమిళ సినిమాతో హీరోయిన్ అయింది. ఇక అక్కడే ఫిక్స్ అయిపోతుందనుకున్నే టైమ్ కు టాలీవుడ్ కు వచ్చేసింది. ఇక్కడ కూడా 2 సినిమాలు చేసింది. ఇక ఇక్కడే ఉంటుందనుకున్న టైమ్ లో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. మళ్లీ టాలీవుడ్ కు వచ్చింది. ఇప్పుడు బన్నీతో సినిమా చేస్తోంది. అయితే చేసిన తప్పునే మళ్లీ రిపీట్ చేయబోతోంది బన్నీ బ్యూటీ పూజా హెగ్డే.