ఒక్క ఫొటో, ఒకే ఒక్క ఫొటో రజనీకాంత్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సూపర్ స్టార్.. తన హెల్త్ చెకప్ తో పాటు అగ్రరాజ్యంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఓ క్యాసినోను కూడా సందర్శించాడు. అక్కడ రజనీకాంత్ క్యాసినో ఆడాడో లేదో తెలీదు కానీ, అక్కడ కూర్చున్న ఫొటో మాత్రం ఒకటి అతడికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
'బాహుబలి 2' సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్త వసూళ్లలో 'దంగల్' సినిమా నంబర్ వన్ ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ రెండు సినిమాలు పోటీపడి మరీ వసూళ్ల వర్షం కురిపించాయి. మిగతా హీరోలకు సరికొత్త టార్గెట్స్ ఫిక్స్ చేశాయి. అయితే ఈ రెండు సినిమాలు సాధించిన రికార్డుల్ని క్రాస్ చేయాలంటే అది కొంతమంది హీరోలకు మాత్రమే సాధ్యం. అందుకే ప్రస్తుతం అందరి చూపు సల్మాన్ ఖాన్, రజనీకాంత్ పైనే పడింది.
కబాలి సినిమా గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో ఉంటుంది. తాజాగా రజనీకాంత్ సెట్స్ పైకి తీసుకొచ్చిన కాలా సినిమా కూడా మాఫియా నేపథ్యంలోనే సాగుతుంది. ఈ రెండు సినిమాలకు ఒకడే దర్శకుడు. సంగీత దర్శకుడు కూడా సేమ్. ఈ విషయాల్ని పక్కనపెడితే ఇప్పుడీ రెండు సినిమాల క్లైమాక్స్ కూడా ఒక్కటే అంటున్నారు.
కబాలి సినిమాలో చివర్లో రజనీకాంత్ చనిపోతాడు. ఫ్యాన్స్ ఒప్పుకోరు కాబట్టి రజనీకాంత్ చనిపోయే షాట్ మాత్రం చూపించరు. బట్ చనిపోయాడనే విషయం మాత్రం క్యారీ అవుతుంది. సేమ్ ట సేమ్ కాలా సినిమా క్లైమాక్స్ కూడా ఇంతే అంటున్నారు.
రజనీకాంత్కి, ముంబైకి ఒక స్పెషల్ లింక్ ఉంది. ముంబైలో మాఫియా డాన్గా రజనీ నటిస్తే సినిమా బ్లాక్బస్టర్. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా చరిత్ర సృష్టిస్తుంది. ఎగ్జాంఫుల్...90లలో వచ్చిన "బాషా" మూవీ. మాణిక్ బాషాగా రజనీ క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఇప్పటికీ ఫిల్మ్ లవర్స్ చెప్పుకుంటారు. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ముంబై మాఫియా డాన్గా మారిపోయాడు రజనీ.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా పార్టీ పెట్టలేదు. మొన్న జరిగిన అభిమానుల భేటీలో కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇక్కడో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు మాత్రం రజనీకాంత్ పార్టీలోకి తాము చేరుతున్నట్టు ప్రకటించారు. వాళ్లే నమిత, మీనా.